కామారెడ్డి రైల్వే గేట్ కష్టాలకు చెక్: 3 వంతెనల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించడానికి, స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చొరవ తీసుకున్నారు. ఆయన దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి, కామారెడ్డిలో పలు కీలక రైల్వే వంతెనల నిర్మాణానికి సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రైల్వే లైన్ పట్టణం మధ్యలో ఉండటం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగి, ప్రజలు తరచుగా రైల్వే గేట్ వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.…

