కల్వకుంట్ల కవిత అరెస్ట్: సింగరేణి కార్మికుల సమస్యలపై నిరసన
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని నాంపల్లిలో గల సింగరేణి భవన్ ఎదుట సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కవిత ఆందోళనకు దిగారు. సింగరేణి భవన్ వద్ద బైఠాయించిన కవితను, ఆమెతో పాటు ఉన్న ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సింగరేణి సమస్యలను పరిష్కరించలేని అసమర్థ ప్రభుత్వం ఇదని విమర్శించారు. డిపెండెంట్ ఉద్యోగులను పునరుద్ధరించాలని మరియు…

