టెక్నాలజీలో భువనేశ్వరి నాకంటే తోపు: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్లో నిర్వహించిన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి నారా భువనేశ్వరి నిర్వహణా దక్షతపై ప్రశంసల జల్లు కురిపించారు. వేలాది మంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి కల్పిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రస్ట్ కార్యకలాపాల్లో ఆమె చూపిస్తున్న క్రమశిక్షణే సంస్థ అభివృద్ధికి మూలమని ఆయన వెల్లడించారు. ప్రసంగం మధ్యలో…

