TELANGANA

TELANGANA

‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం… పోస్టర్ ను ఆవిష్కరించిన వైసీపీ..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూన్ 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. తాడేపల్లిలోని వై‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ‘వెన్నుపోటు దినం’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి…

TELANGANA

కేటీఆర్, కవిత, హరీశ్ మధ్య ఆస్తి గొడవలు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంపై, పార్టీలోని అంతర్గత పరిస్థితులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్, కవిత, హరీశ్ రావు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ విభేదాలు బయటపడి వారు విడిపోకుండా ఉండేందుకే వారంతా కలిసి డ్రామా ఆడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.   కవిత రాసిన లేఖ, హరీశ్ రావు…

TELANGANA

కాళేశ్వరం ప్రాజెక్టును చైనా త్రీ గోర్జెస్ డ్యామ్‌తో పోల్చిన కేటీఆర్..

బలమైన నాయకత్వం, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పం ఉంటే ఎంతటి ప్రగతినైనా సాధించవచ్చని తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ తొమ్మిదేళ్ల పాలనా కాలంలో తెలంగాణ సాధించిన విజయాలు కేవలం దేశానికే పరిమితం కాకుండా, ప్రపంచ దేశాలకు సైతం ఒక నమూనాగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.   లండన్‌లో జరుగుతున్న ‘బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025’ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ‘స్థిరమైన వృద్ధితో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో…

TELANGANA

ఉమ్మడి వరంగల్ కలెక్టర్ల పనితీరుపై మంత్రి పొంగులేటి తీవ్ర అసంతృప్తి..

ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ల పనితీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజలకు అత్యంత కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతుల మంజూరు ప్రక్రియలో నిర్లక్ష్యం తగదని అన్నారు.   లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని, జూన్ 6వ తేదీలోగా అర్హులైన వారి పూర్తి జాబితాను తయారు చేయాలని ఆయన గడువు విధించారు. కేవలం జాబితా మాత్రమే కాకుండా, సంబంధిత ప్రొసీడింగ్స్ కాపీలను కూడా జతచేసి అందించాలని మంత్రి…

TELANGANA

తెలంగాణ‌లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌పై ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఇక వారికి మాత్రమే..

తెలంగాణ‌లో డిగ్రీలో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌పై విశ్వవిద్యాల‌యాల‌ ఉప‌కుల‌ప‌తుల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై డిగ్రీలో క‌నీసం 75 శాతం హాజ‌రు లేకుంటే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పొందేందుకు అర్హ‌త ఉండ‌ద‌ని ఉప‌కుల‌ప‌తుల భేటీలో నిర్ణ‌యించారు.   రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి కార్యాల‌యంలో ఛైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఏడు సంప్ర‌దాయ యూనివ‌ర్సిటీల వీసీల స‌మావేశం గురువారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో డిగ్రీలో క‌నీసం 75 శాతం హాజ‌రు లేకుండా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు అర్హ‌త లేద‌ని గ‌తంలోనే ప్ర‌భుత్వ ఆదేశాలు…

TELANGANA

తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్రమంత్రి సీరియస్ వార్నింగ్..!

తెలంగాణలోని పార్టీ నేతల తీరుపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు నేతలు వ్యక్తిగత ఎజెండాలతో పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇకపై ఇటువంటి ధోరణులను సహించేది లేదని, గీత దాటితే కఠిన చర్యలు తప్పవని ఆయన గట్టిగా హెచ్చరించారు.   పార్టీ కార్యాలయాన్ని కొందరు…

TELANGANA

మూడోసారి కేసీఆర్‌తో హరీష్ భేటీ..! కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చ..?

కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో ముచ్చటగా పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు హరీష్‌రావు. ఇరువురు మధ్య చాలా అంశాలు చర్చకు వచ్చాయి. కాకపోతే తొలుత కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చించారట. ఆ తర్వాత పార్టీ సంక్షోభం గురించి మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి.   కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత కేసీఆర్‌తో హరీష్‌రావు మూడోసారి భేటీ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఇరువురు నేతల మధ్య సమావేశం జరిగింది. కమిషన్ ముందు హాజరవుతానని మంగళవారం సాయంత్రం…

TELANGANA

రాజీవ్ యువ వికాసం పథకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..

తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం అమలు తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం ద్వారా యువతకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వేగవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.   సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన మంజూరు పత్రాలను జూన్ 2వ తేదీ…

TELANGANA

జగిత్యాల కోర్టు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ..

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోర్టు ఆవరణలో నిన్న అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చిన ఓ రిమాండ్ ఖైదీ, పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా పరారయ్యాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ, కాపలా ఉన్న కానిస్టేబుల్ దృష్టి మరలిన క్షణంలో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు, పోలీసుల భద్రతా వైఫల్యంపై చర్చకు దారితీసింది.వివరాల్లోకి వెళితే, పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ అనే…

TELANGANA

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు… తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసులను ఆమె తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగంగానే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు వచ్చాయని అర్థమవుతోందని అన్నారు. తమ పార్టీ నాయకులను…