TELANGANA

TELANGANA

తెలంగాణలో గ్రూప్ -1 ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలో గ్రూప్ -1 ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. గ్రూప్ -1 పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో గ్రూపు – 1 మెయిన్స్ పరీక్షలు గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 563 పోస్టులకు గాను 31,403 (క్రీడల కోటా కలిపి) మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు.   అయితే, జీవో నెం.29ని రద్దు చేయాలని, గ్రూప్ -1 మెయిన్స్…

TELANGANA

హైదరాబాద్ కి బుల్లెట్ రైలు.. ఎప్పుడంటే..?

హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్-ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే నిర్ణయించింది. ఈ కారిడార్‌ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది. దీంతోపాటు మైసూరు-చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ రైలు కారిడార్‌ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తోంది. అదే జరిగితే హైదరాబాద్ నుంచి ముంబై,…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డికి మంద కృష్ణ అల్టిమేటం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వర్గీకరణ అంశంపై అల్టిమేటం జారీ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న లక్ష డప్పులు, వేల గొంతుల సన్నాహక సమావేశం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాలులో శుక్రవారం జరిగింది.   ఈ సమావేశంలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం మొదలవుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీపై కట్టుబడి ఉంటే ఈ నెల 7వ…

TELANGANA

నమ్మి ఓటేస్తే ప్రజలను నట్టేటా ముంచారు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ వార్నింగ్..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్నానని.. గంభీరంగా చూస్తున్నానని.. నేను కొడితే మామూలుగా ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుతామన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని..నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని అన్నారు. చెప్పినా ప్రజలు వినలేదని…అత్యాశకు…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో విస్తుగొలిపే విషయాలు..18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా..

ఫోన్ ట్యాపింగ్‌ కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ హైకోర్టులో పని చేసిన 18 మంది న్యాయమూర్తుల డీటైల్స్.. ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్‌లో ఉన్నట్టు తేలింది. అందులో ఐదుగురు మహిళా న్యాయమూర్తుల సమాచారమూ ఉంది. ఫోన్‌ ట్యాపింగ్‌పై తెలంగాణ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు టీంపై ఇదివరకే కేసు నమోదైంది.   హైదరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో నిందితుల నుంచి…

TELANGANA

తెలంగాణలో ప్రాణాంతక జిబిఎస్ వ్యాధి.. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు..

దేశంలో గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా జిబిఎస్ కేసులు పెరుగుతున్నందున ఆందోళన వ్యాపిస్తోంది. తాజాగా తెలంగాణలో తొలి GBS కేసు నమోదైంది. హైదరాబాద్‌లో గులియన్-బారే సిండ్రోమ్ కేసును వైద్యులు గుర్తించారు. సిద్దిపేటకు చెందిన ఒక మహిళకు GBS లక్షణాలు కనిపించడంతో, ఆమెను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో GBS కారణంగా గత నాలుగు రోజుల్లో ఒక చిన్నారితో సహా ముగ్గురు మరణించారు. మరోవైపు, మహారాష్ట్రలోని పుణేలో దాదాపు 130 జిబిఎస్…

TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికల సమరం..? ఫస్ట్ వీక్‌లో ఎన్నికలపై క్లారిటీ..

స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టిందా? వచ్చేవారం రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీ ముందుకు రానుందా? రాష్ట్రంలో 55 శాతం బీసీలు ఉన్నట్లు తేలిందా? రిజర్వేషన్లు పెంపుపై లీగల్ ఒపీనియన్‌కు సిద్ధమవుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దాదాపు పూర్తి అయ్యింది. డేటా ఎంట్రీ పూర్తి కావడంతో మరో రెండురోజుల్లో ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్‌లో సర్వేపై అధికారులు,…

TELANGANA

వరల్డ్ క్లాస్ టెక్నాలజితో ఉస్మానియా కొత్త ఆసుపత్రి.. 31న శంకుస్థాపన..

అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టెక్నాలజీతో రానుంది కొత్త ఉస్మానియా హాస్పిటల్‌. వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. డిజైన్లు దాదాపు ఖరారు కావడంతో శుక్రవారం (జనవరి 31)న నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.   ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనాల డిజైన్లపై బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. దీనికి ఆరోగ్య, ఆర్ అండ్…

TELANGANA

అధికారులను ప్యాలెస్ కు పిలిపించుకుని అహం ప్రదర్శిస్తున్నావు.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన అన్నావని, సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నావని, ప్రజలను ప్రతిరోజు కలుస్తా అన్నావని… కానీ ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చాటేశావని హరీశ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లోని ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన కొనసాగిస్తున్నావని దుయ్యబట్టారు.   ముఖ్యమంత్రి, మంత్రులు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే చోట ఉండే సువిశాలమైన…

TELANGANA

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. వెలుగులోకి మరిన్ని దారుణాలు..!

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసిన విషయం ఇటీవల బయటపడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ విషయం మరువక ముందే, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ముఠాలోని కీలక…