TELANGANA

TELANGANA

హైదరాబాద్ వాహనదారులకు పోలీసుల సీరియస్ వార్నింగ్: నంబర్ ప్లేట్లతో ఆటలాడితే జైలుకే!

ట్రాఫిక్ చలాన్ల నుండి తప్పించుకోవడానికి వాహనాల నంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల నగరంలో ఒక వ్యక్తి తన వాహనానికి మరొకరి నంబర్ ప్లేట్ తగిలించి తిరుగుతున్న ఉదంతం వెలుగులోకి రావడంతో, పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. నంబర్ ప్లేట్లను మాస్క్ చేయడం, వంచడం లేదా మార్చడం వంటివి కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలే కాదని, ఇవి తీవ్రమైన…

TELANGANA

మేడారం హుండీలో భక్తుల వింత కోరికలు.. అమ్మవార్లకు ప్రేమలేఖలు, సమస్యల విన్నపాలు!

మేడారం మహా జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన 828 హుండీల లెక్కింపు ప్రక్రియ హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో కొనసాగుతోంది. సుమారు 500 మంది సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాలో ఈ లెక్కింపు నిర్వహిస్తుండగా, భక్తులు సమర్పించిన లేఖలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. హుండీల్లో కేవలం కానుకలే కాకుండా, తమ మనసులోని బాధలను, కోరికలను కాగితాలపై రాసి అమ్మవార్లకు నివేదించుకున్నారు. ఈ లేఖల్లో భక్తులు వైవిధ్యమైన సమస్యలను ప్రస్తావించారు. కొందరు తమ ప్రేమలేఖలను హుండీలో వేయగా, మరికొందరు…

TELANGANA

బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ‘ఫెవికాల్’ బంధం.. కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయరు?: నిజామాబాద్‌లో సీఎం రేవంత్ ప్రశ్న

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో, పన్నెండేళ్ల మోదీ పాలనలో నిజామాబాద్ నగరం అభివృద్ధికి నోచుకోలేదని, అది చెత్తకుప్పగా మారిందని విమర్శించారు. నిజామాబాద్ అభివృద్ధి కోసం ఇప్పటికే తమ ప్రభుత్వం 1,045 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. జిల్లాకు ఎయిర్‌పోర్ట్ తీసుకువచ్చే బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకుంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.…

TELANGANA

పాతబస్తీ మెట్రోకు హైకోర్టు బ్రేక్: వారసత్వ కట్టడాల పరిరక్షణపై వివరణ కోరుతూ కీలక ఆదేశాలు!

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా పాతబస్తీ కారిడార్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓల్డ్ సిటీలో మెట్రో లైన్ నిర్మించే క్రమంలో అక్కడ ఉన్న పురాతన వారసత్వ కట్టడాలు దెబ్బతినే అవకాశం ఉందంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (PIL) కోర్టు స్పందించింది. కట్టడాల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాల వివరాలతో మూడు వారాల్లోగా పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని…

TELANGANA

తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్లకు కొత్త రూల్స్: దూరంతో పనిలేకుండా ఫిక్స్‌డ్ ఛార్జీలు – నేటి నుంచే అమలు!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (TGERC) జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఫిబ్రవరి 5, 2026 (గురువారం) నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తున్నాయి. ఇకపై కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులు కరెంట్ స్తంభాలు లేదా లైన్ల దూరం ఆధారంగా అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా విద్యుత్ శాఖ నిర్ణయించిన ‘ఫిక్స్‌డ్ ఛార్జీల’ను చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు, గృహ…

TELANGANA

హైదరాబాద్‌లో ఫైర్ సేఫ్టీ పాఠాలు: రంగంలోకి దిగిన హైడ్రా (HYDRAA)

హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ‘హైడ్రా’ (HYDRAA) అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే లక్ష్యంతో నగర ప్రజలకు, వ్యాపారులకు అగ్ని భద్రతా నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉండే వాణిజ్య సముదాయాల్లో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. ఈ అవగాహన సదస్సుల్లో భాగంగా అగ్నిమాపక పరికరాల వినియోగంపై అధికారులు ప్రాక్టికల్ డెమోలు నిర్వహిస్తున్నారు. మంటలను ఆర్పే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు…

TELANGANA

జగిత్యాల జిల్లాలో విషాదం: ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు కూలీల మృతి

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో మంగళవారం సాయంత్రం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన కూలీలు తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ముగిలిపేట గ్రామ శివార్లలో జరగడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే, మల్లాపూర్ మండలానికి చెందిన కొందరు వ్యవసాయ కూలీలు ఉదయం పసుపు కోత పనుల కోసం పొలానికి వెళ్లారు. పనులన్నీ…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్‌పై కేసీఆర్ ఘాటు లేఖ – న్యాయపరమైన అంశాలతో 6 పేజీల సమాధానం!

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ జూబ్లీహిల్స్ ఏసీపీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. తన నందినగర్ నివాసం గోడకు నోటీసులు అతికించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిట్ (SIT) అధికారులకు 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఇచ్చే నోటీసులను ఇలా బహిరంగంగా గోడకు అతికించడం చట్టవిరుద్ధమని, ఇది తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడమేనని ఆయన మండిపడ్డారు. పోలీసుల ఈ చర్య…

TELANGANA

సీపీపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు.. భగ్గుమన్న ఐపీఎస్, ఐఏఎస్, పోలీస్ సంఘాలు..

కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలంను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఐపీఎస్ అధికారుల సంఘం, ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించాయి. ఎమ్మెల్యే తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, కమిషనర్‌కు, ఇతర పోలీస్ అధికారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.   అసలేం జరిగింది?   గురువారం హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి…

TELANGANA

కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు… ఫామ్‌హౌస్‌లో విచారణ జరపాలన్న విజ్ఞప్తి తిరస్కరణ..

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్‌పీసీ కింద ఈ నోటీసులు ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాకుండా, హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలోనే విచారణ జరపనున్నట్లు సిట్ స్పష్టం చేసింది.   ఇటీవల గురువారం సిట్ తొలిసారి నోటీసులు జారీ చేయగా, మున్సిపల్ ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఖరారు…