TELANGANA

TELANGANA

శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టివేత..

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఈగల్ టీమ్, టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి.   బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పట్టణాల్లో జాతీయ రహదారులపై వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శంషాబాద్ విమానాశ్రయంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.…

TELANGANA

బీసీ బిల్లు సాధ‌న కోసం మూడు రోజుల‌ దీక్ష: ఎమ్మెల్సీ క‌విత‌..

బీసీ బిల్లు సాధ‌న కోసం 72 గంట‌లు దీక్ష చేయ‌నున్న‌ట్లు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత ప్ర‌క‌టించారు. ఈ బిల్లు దేశానికి ఎంత అవ‌స‌ర‌మో చాటి చెప్పేందుకు ఆగ‌స్టు 4, 5, 6 తేదీల్లో 72 గంట‌లు దీక్ష చేయ‌నున్న‌ట్టు ఆమె తెలిపారు. ఈ రోజు హైద‌రాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో క‌విత మాట్లాడారు.   బీసీ బిల్లు సాధ‌న కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయ‌నున్న‌ట్టు చెప్పారు.…

TELANGANA

ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

ఉపాధ్యాయ లోకానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. దీనితో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు త్వరలో పదోన్నతులు లభించనున్నాయి. రానున్న రెండు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.   తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన పలువురు ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదోన్నతులు కల్పిస్తామని…

TELANGANA

కేటీఆర్ గురించి సీఎం రమేశ్ చెప్పింది నిజమే: బండి సంజయ్..

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని, సిరిసిల్ల టికెట్ రావడానికి సీఎం రమేశ్ కేటీఆర్‌కు ఆర్థికంగా సాయం చేశారని, దాని వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని బండి సంజయ్ అన్నారు. సీఎం రమేశ్ తో చర్చకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కరీంనగర్‌లో చర్చకు వేదిక తానే ఏర్పాటు చేస్తానని, మధ్యవర్తిత్వం…

TELANGANA

కొండాపూర్‌లో రేవ్‌ పార్టీ కలకలం.. ఏపీకి చెందిన 11 మంది అరెస్ట్‌..

వీకెండ్ వచ్చిందంటే చాలు.. సర్వీస్ అపార్ట్‌మెంట్లో మద్యం విందులు, డ్రగ్స్ వినియోగాలు, అమ్మాయిలు.. డాన్సులు.. రేవు పార్టీలు. ఇలాంటి రేవు పార్టీనే హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో వెలుగు చూపింది. ఏపీకి చెందిన ముఠా కొండాపూర్‌లోని ఎస్వీ నిలయం అనే సర్వీస్ పార్ట్‌మెంట్‌లో.. రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు.   2 కేజీల గంజాయి, కుష్ గంజాయి స్వాధీనం దాడులు చేసిన స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ 2 కేజీల గంజాయి, కుష్ గంజాయిని స్వాధీనం చేసుకుంది. 11.57 గ్రాముల మ్యాజిక్…

TELANGANA

బీఆర్ఎస్ విలీనంపై మరిన్ని సంచలనాలు..!

బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేసేందుకు తనతో రాయబారం నడిపే ప్రయత్నం చేశారంటూ కేటీఆర్ గురించి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోలేదని, మరికొన్ని సంచలనాలు మిగిలే ఉన్నాయని చెప్పారాయన. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటపెడతానన్నారు. నెక్స్ట్ ఎపిసోడ్స్ మిగిలే ఉన్నాయని హింట్ ఇచ్చారు సీఎం రమేష్ బతిమిలాడారు.. “మేం ఇబ్బందుల్లో ఉన్నాం, మా నాన్న ఆరోగ్యం బాలేదు, మధనపడిపోతున్నారు, నువ్వు సాయం…

APNationalTELANGANA

ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..

ఏపీ, తెలంగాణ‌ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తుది ఉత్తర్వులు జారీ చేసింది.   ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో పునర్విభజన సమయంలో.. ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని…

TELANGANA

హైదరాబాద్‌లో మరో అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జ్..

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలో మీరాలం చెరువుపై రూ. 430 కోట్ల వ్యయంతో ఒక ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఐకానిక్ కేబుల్ వంతెన బెంగళూరు జాతీయ రహదారి వద్ద శాస్త్రిపురం నుండి చింతల్‌మెట్ రోడ్‌ను కలుపుతుంది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) మోడ్‌లో నిర్మించనున్నారు.…

TELANGANA

వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణకు రూ.205 కోట్ల నిధులు విడుదల..

రాష్ట్రంలో వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో భాగంలో రేవంత్ సర్కార్ కీలక ముందడుగు వేసింది. ఈ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో.. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నావిగేషనల్ ఇన్‌స్ట్రుమెంట్ ఇన్‌స్టలేషన్ వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు.   వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం గతంలో కొన్నేళ్ల…

TELANGANA

రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన డిప్యూటీ కమిషనర్..

ఒక హోటల్ యజమాని నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ సిటీ రేంజ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..   తన సర్కిల్ పరిధిలోని ఒక హోటల్‌ను రవికుమార్ ఇటీవల తనిఖీ చేశారు. హోటల్ వంటగదిలో అపరిశుభ్రంగా ఉండటం, నిబంధనలు పాటించకపోవడంతో సీజ్ చేస్తానంటూ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ బెదిరించారు. హోటల్ సీజ్ చేయకుండా ఉండాలంటే రూ.5…