TELANGANA

TELANGANA

గురుకులాలను నరక కూపాలుగా మార్చారు.. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్..

రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల పరిస్థితిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలు నరక కూపాలుగా మారాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్, పాముకాట్లు, విష జ్వరాల బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.   ఈ సందర్భంగా హరీశ్ రావు స్పందిస్తూ.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. కల్తీ ఆహారం పెడితే…

TELANGANA

ఖైరతాబాద్ వినాయకుడికి ఘన వీడ్కోలు.. ముగిసిన నిమజ్జనం..

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఒక ఘనమైన వేడుక. దీనిని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. 71 ఏళ్ల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో “శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతి” రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఈ విగ్రహం, హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లతో ముందుకు…

TELANGANA

లండన్ నుంచి రాగానే ఫామ్‌హౌస్‌కు.. కవిత ఆరోపణలపై కేసీఆర్‌తో హరీశ్ భేటీ..

మాజీ మంత్రి హరీశ్‌రావుపై కవిత చేసిన తీవ్ర ఆరోపణలు సృష్టించిన రాజకీయ ప్రకంపనల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశీ పర్యటనను ముగించుకుని ఈ ఉదయం నగరానికి చేరుకున్న హరీశ్‌రావు మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం ఆయన నేరుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరి వెళ్లారు.   కవిత ఇటీవల హరీశ్‌రావుతో పాటు ఎంపీ సంతోష్‌రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్‌లో ఉన్నారని,…

TELANGANA

కవిత అబద్ధం చెప్పారు… హరీశ్ వల్ల కాదు, కేసీఆర్ వల్లే బీఆర్ఎస్‌ను వీడా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి..

బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ వంటి నేతలు బయటకు వెళ్లిపోవడానికి మాజీ మంత్రి హరీశ్ రావు కారణమంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కవిత ఆరోపణల్లో వాస్తవం లేదని, తాను బీఆర్ఎస్‌ను వీడటానికి కేసీఆర్, కేటీఆరే కారణమని ఆయన స్పష్టం చేశారు. హరీశ్ రావు వల్ల తాను పార్టీని వీడలేదని తేల్చి చెప్పారు.   “కేసీఆర్, కేటీఆర్ అహంకారం, వారి…

TELANGANA

కలెక్టరేట్‌లో కలకలం.. రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన అధికారిణి..

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో ఒక మహిళా అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జిల్లా మత్స్యశాఖ అధికారిణి (డీఎఫ్‌ఓ)గా పనిచేస్తున్న ఎం. చరితారెడ్డి రూ.20,000 లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.   ఒక వ్యక్తి తన మత్స్యకార సహకార సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు అనుమతి కోసం డీఎఫ్‌ఓ చరితారెడ్డిని సంప్రదించారు. అయితే,…

TELANGANA

కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేస్తున్నాయి..!:కేటీఆర్..

కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేస్తున్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో కేటీఆర్ సమక్షంలో పినపాక నియోజకవర్గం, మణుగూరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్ రావు, ఆయన అనుచరులు బీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ 21 నెలల పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అన్నారు.   ప్రతి రైతూ అప్పటి రోజులే బాగుండేవని చెబుతున్నారని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల…

TELANGANA

బీఆర్ఎస్ కు ఎక్స్ వేదికగా కవిత కౌంటర్..

మాజీ మంత్రి హరీశ్ రావుపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు కవిత కౌంటర్ ఇచ్చింది. నిజం మాట్లాడినందుకు ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తే.. తెలంగాణ ప్రజల కోసం ఇంతకు వందరెట్లు ఎక్కువైనా భరిస్తా అని ఆమె ఎక్స్ వేదికగా బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘సత్యమేవ జయతే… జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.   బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత…

TELANGANA

గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు..! బెండాలపాడులో చారిత్రక ఘట్టం..! ప్రారంభించనున్న సీఎం రేవంత్..

ఏళ్ల తరబడి గుడిసెల్లోనే గడిపిన గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన బెండాలపాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వేదిక కానుంది . ఈ పథకం కింద నిర్మించిన ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది.   సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:20 గంటలకు హెలికాప్టర్‌లో బెండాలపాడుకు చేరుకుంటారు. గ్రామంలోని లబ్ధిదారులైన బచ్చల నర్సమ్మ, బచ్చల…

TELANGANA

వామనరావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు.. రంగంలోకి దిగిన సీబీఐ..!

తెలంగాణలో నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారికంగా స్వీకరించింది. ఈ మేరకు ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.   సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ పేర్లను నిందితులుగా…

TELANGANA

కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న కవిత..!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, కవిత సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆమె దాదాపుగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.   బీఆర్ఎస్ పార్టీ తనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయకముందే, తానే స్వయంగా ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాలని కవిత యోచిస్తున్నారని ఆమె సన్నిహిత వర్గాలు…