రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ. కోటి చొప్పున అందుకున్నవారు వీరే..!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సాహితీ, కళా రంగాల్లో విశేష సేవలందించిన తొమ్మిది మంది ప్రముఖులను ఘనంగా సత్కరించింది. ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వీరికి పురస్కారాలు అందజేశారు. ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారాలను అందించారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలోనూ, సాంస్కృతిక వైభవ వ్యాప్తిలోనూ కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవించే ఉద్దేశంతో ఈ పురస్కారాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.…

