తెలంగాణ కీలక నిర్ణయం: రాష్ట్ర రవాణా శాఖ చెక్ పోస్టులన్నీ తక్షణమే మూసివేత
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రవాణా శాఖ తనిఖీ కేంద్రాలన్నింటినీ తక్షణమే మూసివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం, డిప్యూటీ రవాణా కమిషనర్లు, జిల్లా రవాణా అధికారులు (DTOs) తనిఖీ కేంద్రాల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సంకేతాలు వంటి అడ్డంకులను వెంటనే తొలగించాలని, వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. తనిఖీ కేంద్రాల వద్ద ఇకపై…

