స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..! కామారెడ్డిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళిక రచించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో ‘బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభ ద్వారానే స్థానిక ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించాలని భావిస్తోంది. ఈ కార్యక్రమానికి…

