TELANGANA

TELANGANA

కొత్త డీజీపీ..! డీజీపీ రేసులో ఎవరెవరంటే..?

ఇప్పటికే సీఎస్ శాంతికుమారి టర్న్ పూర్తి అయింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ఎంపికయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో డీజీపీ జితేందర్ రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో కొత్త పోలీస్ బాస్ కోసం ప్రభుత్వం కసరత్తు కంప్లీట్ చేసింది.   డీజీపీ రేసులో ఎవరెవరంటే..   డీజీపీ రేసులో 8 మంది సీనియర్ ఐపీఎస్‌లు ఉన్నారు. ఎనిమిది మంది అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. రవి గుప్తా, సీవీ ఆనంద్,…

TELANGANA

గ్రూప్-1 పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు రూ. 20,000 చొప్పున జరిమానా..

టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంపై పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు అఫిడవిట్లు సమర్పించి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ 19 మంది పిటిషనర్లకు రూ.20,000 జరిమానా విధించింది. అంతేకాకుండా, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.   తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మొత్తం 19 మంది అభ్యర్థులు హైకోర్టును…

TELANGANA

అమ్మాయిలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్….

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యంపై దృష్టి సారిస్తోంది. తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో యువతులకు సరైన ఆహారం లేక నానా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందుకోసం చిన్నప్పటి నుంచి మంచి ఆహారం తీసుకుంటే వ్యాధులు రావని భావిస్తోంది. దీనికి తోడు మారుతున్న జీవనశైలి, ఆపై ఆహారం అలవాట్లు. ఇవన్నీ టీనేజీ యువతులపై ప్రభావం కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతల కోసం కొత్త స్కీమ్ తీసుకురావాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్.   యువతులకు కొత్త స్కీమ్   తెలంగాణలో…

TELANGANA

హైదరాబాద్ లో మరో ప్రపంచ స్థాయి సమ్మిట్…

హైదరాబాద్ లో మరో ప్రపంచ స్థాయి సమ్మిట్. ఇంతకీ భారత్ సమ్మిట్ పేరిట జరగనున్న ఈ కార్యక్రమ సరళి ఎలాంటిది? ఇందులో ఎవరెవరు పాల్గొంటారు? ఏయే అంశాలపై చర్చ సాగనుంది? దీని అసలు ఉద్దేశమేంటి? ఆ ఫుల్ డీటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.   కాంగ్రెస్ దార్శనికతను అద్దం పట్టేలా.. భారత్ సమ్మిట్ 2025 ఏప్రిల్ 25, 26వ తేదీల్లో హైదరాబాద్ లోని HICCలో నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. అలీనోద్యమానికి పునాది వేసిన చారిత్రాత్మక బాండుంగ్ సమావేశం…

TELANGANA

అఘోరీ మెడికల్ టెస్టులో అతి భయంకరమైన విషయాలు….

లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఎపిసోడ్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలుకు చేరింది. చీటింగ్ కేసులో చేవెళ్ల కోర్టు అల్లూరి శ్రీనివాస్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. లెక్క ప్రకారమైతే సంగారెడ్డి సబ్ జైలులో ఉంచాలి అఘోరీని. ముందుగా అఘోరీ సంగారెడ్డి సబ్ జైలుకే తీసుకెళ్లారు. కానీ, అఘోరీ ఆడా? మగా? క్లారిటీ కావాలంటూ అక్కడి జైలు అధికారులు రిజెక్ట్ చేశారు. చేసేది లేక పోలీసులు మళ్లీ వైద్య పరీక్షలు చేయించారు.   వైద్య పరీక్షల్లో…

TELANGANA

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్‌డేట్స్..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ ఇందిరమ్మ ఇళ్లు. దీన్ని పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది. ఏ మాత్రం అవకతవకలకు చోటు ఇవ్వకుండా చర్యలు చేపడుతోంది. సమయం తీసుకున్నా, విపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లబ్దిదారుల గుర్తింపునకు ప్లాన్ ప్రకారం వెళ్తోంది.   ఈ క్రమంలో ఈ నెల(ఏప్రిల్) 30లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయనుంది. ఈ మేరకు పైస్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ…

TELANGANA

చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారంలో కొత్త ట్విస్ట్..

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం కలిగి లేనప్పటికీ, తప్పుడు పత్రాలు సమర్పించి గతంలో ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈ ఫిర్యాదు అందజేశారు. చెన్నమనేని రమేశ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ…

TELANGANA

ఆ పోలీసు అధికారుల పేర్లు రాసి పెట్టుకుంటాం..-: కేటీఆర్ హెచ్చరిక

లగచర్ల బాధితులను ఇంకా కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి అధికారుల పేర్లను రాసిపెట్టుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మరో మూడేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అతిగా ప్రవర్తించిన అధికారులు రిటైర్ అయినా, ఎక్కడ ఉన్నా వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల నిర్వహణకు విరాళం అందజేశారు.…

TELANGANA

కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వాఖ్యలు..!

బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా.. అదనంగా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విర్శంచారు. నిజామాబాద్ లో నిర్వహించిన రైతు మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.   ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులను త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మించి ఉంటే ఉమ్మడి…

TELANGANA

వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్..! జపాన్ కంపెనీలకు సీఎం రేవంత్ ఆహ్వానం..

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారితో చర్చించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.   జపాన్ కంపెనీలకు సీఎం రేవంత్ ఆహ్వానం   ఒసాకాలో జరుగుతున్న…