TELANGANA

TELANGANA

జపాన్ లో మరో రెండు కంపెనీలతో రేవంత్ రెడ్డి బృందం ఎంవోయూ..

తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా బృందం ఇప్పటికే పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది, ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది.   తెలంగాణ యువతకు విదేశాల్లో, ముఖ్యంగా జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జపాన్‌కు…

TELANGANA

ఎస్ఎల్‌బీసీ సొరంగంలో డేంజర్ జోన్‌లో వ్యర్థాల తొలగింపు కోసం ప్రయత్నాలు..!

ఎస్ఎల్‌బీసీ సొరంగం డేంజర్ జోన్‌కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సొరంగంలో రెండు నెలలుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా, డేంజర్ జోన్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులు, సహాయక సిబ్బంది నిరంతరం చర్చిస్తున్నారు.   సొరంగం మార్గంలో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లతో పాటు ప్రమాద సమయంలో ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ యంత్ర భాగాలను ఇదివరకే వెలికి తీశారు. అక్కడి నుంచి మరో 43 మీటర్లను డేంజర్ జోన్‌గా గుర్తించారు.…

TELANGANA

సైబరాబాద్‌పై ఉగ్రదాడికి కుట్ర.. ఎన్ఏఐ నివేదికలో కీలక విషయాలు..

హైదరాబాద్‌లో ఉగ్రదాడికి లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కుట్ర పన్నిందని, ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ వెల్లడించినట్లు ఎన్ఐఏ నివేదిక పేర్కొంది. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్ హుస్సేన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. ఎన్ఐఏ గతంలోనే హెడ్లీని విచారించింది. ఈ విచారణలో హెడ్లీ సంచలన విషయాలు వెల్లడించినట్లు ఎన్ఐఏ నివేదిక ద్వారా తెలుస్తోంది.   తాను ఎల్ఈటీతో కలిసి పనిచేసినట్లు డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగా పలుమార్లు…

TELANGANA

బీఆర్ఎస్ రజతోత్సవ సభ… నేతలకు కీలక సూచనలు చేసిన కేసీఆర్..

ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నేతలు, మహిళా నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు.   రజతోత్సవ సభలో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు, సభను విజయవంతం చేయడంలో వారి భాగస్వామ్యం, కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి…

TELANGANA

సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనలో బిగ్ డీల్..!

సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనలో బిగ్ డీల్. తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడితో సరికొత్త ప్రాజెక్ట్ చేపట్టేందుకు ‘మారుబేని’ కంపెనీ ముందుకొచ్చింది. రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యూచర్ సిటీలో.. 600 ఎకరాల్లో.. వరల్డ్ క్లాస్ నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబెనీ సంస్థ అంగీకరించింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ బృందాన్ని కలుసుకుని.. పెట్టుబడులపై చర్చించారు. ముఖ్యమంత్రి సమక్షంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ సాకారమైతే.. ఫ్యూచర్…

TELANGANA

గ్రూప్-1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 నియామక ప్రక్రియపై విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఇవ్వవద్దని ఆదేశించింది. అయితే వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను మాత్రం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.   గ్రూప్-1 ఫలితాలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. రెండు సెంటర్లలోనే 74 మందికి ర్యాంకులు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయనడానికి ఇదే నిదర్శనమని…

TELANGANA

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కవిత సంచలన వ్యాఖ్యలు..! అందుకోసమే పార్టీ మారాడు అంటూ ఆరోపణ..?

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆశ్చర్యం కలిగించిందని, ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన డబ్బు కోసమే అధికార పార్టీ వైపు వెళ్లారని అందరూ అంటున్నారని ఆమె పేర్కొన్నారు.   ప్రజలకు ఏదైనా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఆయన పార్టీ మారాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యేల పనితీరుపై ర్యాంకులు ఇచ్చారని, 119 మంది…

TELANGANA

కంచ గచ్చిబౌలి భూముల్లోని చెట్ల నరికివేతపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు..

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఆ భూముల్లో చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు తీసుకోకుండా చెట్లను కొట్టివేసినట్లు తేలితే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సహా సంబంధిత అధికారులు అందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.చెట్లు కొట్టేసే ముందు 1996లో…

TELANGANA

ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్..! సీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలు..

పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటితే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పదవులపై బహిరంగ మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని.. ష్టమే జరుగుతుందని చెప్పారు. మంగళవారం జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో సీఎం మాట్లాడారు. ఎవరైనా పదవులపై బయట మాట్లాడితే మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుందన్నారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఇప్పటికే అనేకసార్లు చెప్పినని.. లీడర్లు అర్ధం కాకపోతే ఎలా అంటూ ఫైరయ్యారు.   ఎమ్మెల్యేలకు CM రేవంత్ సీరియస్ వార్నింగ్  …

TELANGANA

తెలంగాణలో అధునాతన ఫైర్ ఫైటింగ్ రోబోలు..! దేశంలోనే మొట్టమొదటిసారి..!

రాష్ట్ర అగ్నిమాపక శాఖ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా, అత్యంత ప్రమాదకరమైన అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం అధునాతన ఫైర్ ఫైటింగ్ రోబోలను అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే క్లిష్ట పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ రోబో యంత్రాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రారంభ దశలో భాగంగా, ఫ్రాన్స్ నుంచి మూడు అత్యాధునిక రోబోలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. ఒక్కో రోబో విలువ సుమారు రూ. 2 కోట్లు కాగా, మొత్తం…