TELANGANA

TELANGANA

గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లు విడుదల చేస్తూ.. 9990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసిన రేవంత్ సర్కార్..

గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజులోనే రూ.153 కోట్లు విడుదల చేస్తూ 9990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసింది. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు బిల్లులను ఈ విడతలో చెల్లించడం గమనార్హం. 2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం మిగిల్చిన భారీ మొత్తంలో పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు నడుం బిగించింది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ..

తెలంగాణలో మినీ అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మినీ అంగన్‌వాడీలను పూర్తిస్థాయి అంగన్‌వాడీలుగా గుర్తించి, వారికి పెంచిన వేతనం పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు.   రాష్ట్రంలో పనిచేస్తున్న 3,989 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నిరుపేద వర్గాలకు అంకితభావంతో సేవలు…

TELANGANA

హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం.. నకిలీ పత్రాలతో..

హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తూ, నకిలీ పత్రాలతో భారత ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందిన మయన్మార్ దేశస్థుల ముఠా గుట్టు రట్టయింది. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం జరిపిన దాడుల్లో మయన్మార్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరు కొన్నేళ్ల క్రితం మయన్మార్ నుంచి అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించి, ఇక్కడ తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మదర్సాలో పనిచేసే కొందరు ఉపాధ్యాయుల పాత్ర…

TELANGANA

తెలంగాణలో 77 మంది డీఎస్పీల బదిలీలు.!

రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో సోమవారం భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డీజీపీ జితేందర్ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా కొందరికి నూతన పోస్టింగులు కేటాయించగా, మరికొందరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.   పోలీసు శాఖలో పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ఈ బదిలీల్లో పలువురు కీలక అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్…

TELANGANA

కాళేశ్వరం దర్యాప్తులో కీలక ట్విస్ట్..! విచారణకు మాజీ సీఎం కేసీఆర్..?

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించిన (క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన) తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామం నేపథ్యంలో కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది.   వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో…

TELANGANA

‘తెలంగాణ రైజింగ్’ అంటే ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడమేనా..: హరీష్ రావు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యం ధరలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. బీర్లను, బార్లను నమ్ముకుని, మద్యం అమ్మకాల ద్వారా ఖజానా నింపుకోవడమే ‘మార్పు’ అని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలి, కేవలం ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి సారించిందని, “ఎక్సైజ్ ఆదాయంలో ‘తెలంగాణ రైజింగ్’ అంటే ఇదేనా?” అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.   హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను అటకెక్కించి,…

TELANGANA

నకిలీ వైద్యులపై వేటు వేసిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్..!

తెలంగాణలోని పలు నగరాలు, పట్టణాల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ తరహా వైద్యులు పుట్టుకొస్తున్నారు. అర్హత లేకున్నా నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతూ ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో కొంతకాలం సహాయకులుగా పనిచేసి, ఆ తరువాత వైద్యులుగా అవతారమెత్తుతున్నారు. ఎలాంటి అర్హత లేకుండానే రోగులకు యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ వంటి మందులు ఇస్తున్నారు.   ఈ క్రమంలోనే అర్హత లేని వైద్యుడు, అనుమతులు లేని ఆసుపత్రిలో ఓ మహిళకు శస్త్రచికిత్స చేయగా, వైద్యం వికటించి…

TELANGANA

సిద్దిపేట జవాన్‌ భూ కబ్జా ఆరోపణ.. వీడియో షేర్ చేసిన హరీశ్ రావు..!

దేశ రక్షణలో పాలుపంచుకుంటున్న ఓ సైనికుడి భూమి కబ్జాకు గురైందంటూ వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే ఆర్మీ జవాను, తన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమంలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు వెంటనే స్పందించారు.   జవాన్ రామస్వామి ఎదుర్కొంటున్న సమస్యను ఆయన తీవ్రంగా…

TELANGANA

మూసి వరదలపై హైడ్రా ఫోకస్..!

అసాధారణమైన వర్షాలకు హైదరాబాద్‌ అతలాకుతలం అవుతోంది. గట్టిగా వాన పడిందంటే చాలు.. భాగ్యనగరం సంద్రంగా మారుతుంది. ఈ క్రమంలో నగరానికి వ‌ర్షాకాల వ‌ర‌ద‌ముప్పు త‌ప్పించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై హైడ్రా మేధోమ‌ధ‌నం చేసింది. మూసీన‌ది సరిహద్దు గుర్తింపు, ORR లోపల నాలా నెట్‌వ‌ర్కులతో పాటు మూసీ వెడ‌ల్పుల‌ నిర్ధారణ అనే అంశంపై హైడ్రా స‌ద‌స్సు నిర్వహించింది.   మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం హైడ్రాకు లేన‌ప్పటికీ.. మూసీ ఆక్రమ‌ణ‌ల‌పై హైడ్రాకు అందుతున్న ఫిర్యాదుల నేప‌థ్యంలో.. అస్సలు ఆ…

TELANGANA

ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం..! ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్..

ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. మూడు రోజుల పాటు ప్రశ్నించిన సిట్ బృందం.. వీరి ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. ఈ రోజు మార్నింగ్ నుంచి ఏకధాటిగా 9 గంటల పాటు సిట్ ఇద్దరినీ విచారించిన విషయం తెలిసిందే.   రేపు వీరి ఇద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200…