TELANGANA

TELANGANA

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..! మరో కొత్త పథకం..

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా పోడు రైతులకు ఇది ఊహించని తీపి కబురు. రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతుల కోసం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా 6 లక్షల ఎకరాల భూములకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్‌ మండలంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.   ఇందిర సౌర గిరి జల…

TELANGANA

మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్స్..

తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ అనగానే గుర్తుకొచ్చేవారిలో మంత్రి కొండా సురేఖ ఒకరు. తనకు ఏదైనా తెలుస్తే ఓపెన్‌గా బయటపెడతారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు. అవే ఒక్కోసారి ఆమెకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి కూడా. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..   మంత్రి కొండా సురేఖ గురించి చెప్పనక్కర్లేదు. మనసులో ఏమీ దాచుకోకుండా నిజాన్ని ఓపెన్‌గా చెప్పేస్తారు. ఆ తర్వాత ఎవరు…

TELANGANA

సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్.. కాళేశ్వరంలో ఘనంగా ఏర్పాట్లు..

దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి.ఇప్పటికే త్రివేణి సంగమం దగ్గర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి శ్రీధర్‌ బాబు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరు రాష్ట్రాల నుంచి దాదాపు 50లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.   ఉదయం 5.44…

TELANGANA

సీఈ రమణారెడ్డికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్..!

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో మహబూబ్‌నగర్‌ జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ (సీఈ) రమణారెడ్డికి సీఎం తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. “అక్కడ (గతంలో పనిచేసిన చోట) చేసినట్లు ఇక్కడ కూడా చేస్తే కేసు పెట్టి లోపల వేయిస్తా” అంటూ సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. రమణారెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో…

TELANGANA

రైతులు చస్తున్నా అందాల పోటీలలో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి : కేటీఆర్

ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతన్నల కష్టం మాత్రం తీరడం లేదు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, పంటలు పండించి ధాన్యపు రాశులను మార్కెట్ కు తరలించిన సకాలంలో కొనుగోలు చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క అకాల వర్షాలు, ఓ పక్క మండుటెండలు అన్నదాతలను విలవిలలాడేలా చేస్తున్నాయి.   మళ్లీ అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. అంతేకాదు కొంతమంది అన్నదాతలు పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కు వెళ్లి వడ దెబ్బతో మృతి చెందుతున్న…

TELANGANA

క్షిపణి తయారీ కేంద్రంగా హైదరాబాద్..!

ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో అనిశ్చిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం రక్షణ రంగంలో అప్రమత్తమైంది. బ్రహ్మోస్, ఆకాష్ వంటి కీలక క్షిపణుల తయారీతో పాటు వాటికి అవసరమైన విడిభాగాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సంబంధిత తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు కాకుండా, శాంతి నెలకొన్నప్పుడే సన్నద్ధత కీలకమని కేంద్రం భావిస్తోంది.   క్షిపణి తయారీ కేంద్రంగా హైదరాబాద్ ప్రాధాన్యత భారతదేశపు “మిస్సైల్ క్యాపిటల్”గా పేరుగాంచిన హైదరాబాద్, అనేక ప్రభుత్వ, ప్రైవేట్…

TELANGANA

ఆరు నెలలు కాల్పుల విరమణ.. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం..!

తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు.. కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ.. మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం మావోయిస్టు పార్టీ అగ్రనేత జగన్ పేరిట లేఖ విడుదలైంది.   ‘‘తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్ట్ పార్టీకి, ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలనే డిమాండ్‌ను ప్రముఖంగా చేస్తున్నారు. దీనిని దృష్టిలో…

TELANGANA

ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..!

ఏప్రిల్ 22, పహల్గాం ఉగ్రదాడి తర్వాత జాగ్రత్తగా గమనిస్తే.. ఇద్దరు రాజకీయ నేతలు మిగతా వారందరి కంటే ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆ ఇద్దరు మన తెలుగు నాయకులే కావడం గర్వకారణం. ఒకరు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మరొకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. టెర్రర్ అటాక్‌ బాధితులకు నివాళిగా పార్టీ తరఫున 3 రోజులు సంతాప దినాలను నిర్వహించారు జనసేనాని. బాధిత తెలుగు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. పార్టీ తరఫున 50 లక్షల పరిహారం అందించారు.…

TELANGANA

క్లైమాక్స్‌లో ఆపరేషన్ కగార్‌,..!

ఆపరేషన్ సిందూర్‌తో సరిహద్దులు ఎరుపెక్కాయి. ఆపరేషన్ కగార్‌తో కర్రెగుట్టల రక్తమోడాయి. కర్రెగుట్టల్లో కాల్పుల మోత మోగుతూనే ఉంది. చంద్రన్న దళంతో భద్రత బలగాలు భీకర యుద్ధమే చేస్తున్నాయి. నూగూరు శివారు పెద్దగుట్ట దగ్గర భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 4 గంటల పాటు హోరాహోరాగా ఫైరింగ్ కొనసాగింది. మావోయిస్టుల తూటాలకు ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అదే ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్నతో సహా 22 మంది మావోయిస్టులు హతమయ్యారు.…

TELANGANA

హైదరాబాద్‌లో ‘మిస్ వరల్డ్’ సందడి షురూ..!

హైదరాబాద్ నగరం మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక కానుంది. మే 10వ తేదీ నుంచి 31 వరకు చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్ (ఖిల్వత్ ప్యాలెస్)లో ‘మిస్ వరల్డ్-2025’ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా చార్మినార్‌తో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సముదాయాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.   సౌత్ జోన్ పోలీసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విదేశీ ప్రతినిధులు, సందర్శకుల…