TELANGANA

TELANGANA

తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం తథ్యమని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మనం తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్‌కు ఏమీ కాదని స్పష్టం చేశారు.   తెలంగాణ అస్థిత్వ పార్టీ బీఆర్ఎస్ అని ఆయన…

TELANGANA

రాష్ట్ర అవసరాలపై మంత్రి సీతక్క ప్రజెంటేషన్.. నిధులు ఇవ్వమని కేంద్రానికి విజ్ఞప్తి..

తెలంగాణ‌లోని తాగునీటి వ్య‌వ‌స్థ స్థిరీక‌ర‌ణ‌ కోసం అవ‌స‌ర‌మైన‌ నిధులు మంజూరు చేయాల‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క కేంద్ర ప్ర‌భుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ తాగునీటి అవ‌స‌రాలు తీర్చేందుకు నీతి ఆయోగ్ గ‌తంలో సిఫార్సు చేసిన విధంగా క‌నీసం రూ.16 వేల కోట్ల‌ను మంజూరు చేయాల‌ని కోరారు. ప్ర‌తి ఏటా తాగు నీటి అవ‌స‌రాల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం సుమారు రూ. 5 వేల కోట్ల‌ను వెచ్చిస్తుంద‌ని గుర్తు చేశారు. కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ…

TELANGANA

ఆరు నెలల తర్వాత పార్టీ ఆఫీసుకు కేసీఆర్.. వాటిపై చర్చించే అవకాశం..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. చాన్నాళ్ల తర్వాత పార్టీ ఆఫీసుకు వస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇంతకీ గులాబీ బాస్ ప్లాన్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల వైపు కాకుండా.. కేవలం ఉప ఎన్నికలపై ఫోకస్ చేశారా? అందుకోసమే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.   ఎంతమంది హాజరు?   బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్…

TELANGANA

సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. సర్వత్ర ఉత్కంఠ..

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది.   గత విచారణ సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సమాధానంగా……

TELANGANA

ఉప ఎన్నికలు ఖాయం.. సిద్ధంగా ఉండండి: కేటీఆర్..

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నెల 10వ తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈమేరకు ప్రశ్నించింది. స్పీకర్ సమయం నిర్దేశించకుంటే… తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై…

TELANGANA

హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి సీరియస్..

హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా నిబంధనలు ఎందుకు పాటించరు? చట్టివిరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా?.. సెలవు రోజు కూల్చివేతలు చేయడం అలవాటుగా మారిందని హైకోర్టు మండిపడింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో సెలవు రోజు (ఆదివారం) ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన షెడ్ ను అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కూడా అతనికి నమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టి అక్కడి హైడ్రా…

TELANGANA

రాష్ట్రానికి కేంద్ర సాయం సున్నా.. పోరాటానికి సిద్దం కావాలని సీఎం పిలుపు..

కేంద్రం నుండి తెలంగాణకు వస్తున్న సాయం శూన్యమని, త్వరలో కేంద్రంపై పోరాటం చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం జరిగిన యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా సీఎం సంచలన కామెంట్స్ చేశారు.   సీఎం మాట్లాడుతూ.. హనుమంత రావు యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్ లో పని చేశారన్నారు.…

TELANGANA

ప్రయాగ్ రాజ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తులు మృతి..

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు – కారు ఒకదానికొకటి ఢీకున్నాయి. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రయాగ్ రాజ్- మీర్జాపుర్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహాకుంభమేళాకు వెళ్తున్న ట్రావెల్ బస్సును కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి…

TELANGANA

టిడిపికి రెడ్ బుక్..! బిఆర్ఎస్ కు పింక్ బుక్..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుశ పాలన సాగిస్తుంది అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని కవిత ఫైరయ్యారు. జనగామలో మాట్లాడిన ఆమె తాము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని ఇంతకింత చెల్లిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో రెడ్ బుక్ లా తెలంగాణలో పింక్ బుక్ మెయింటైన్ చేస్తామన్నారు.   లెక్క చూస్తాం… వదిలిపెట్టం: ఎమ్మెల్సీ కవిత తమ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు…

TELANGANA

కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం..

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 19న పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.   సమావేశ నిర్వహణకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలతో పాటు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు,…