ఎండిపోతున్న పంటపొలానికి బకెట్లతో నీళ్లు..! రైతు పడుతున్న ఆవేదన చూపరులను కలచివేస్తోంది..!
ఆశగా ఆకాశం వైపు చూస్తూ, ఎండిపోతున్న పంటను ఎలాగైనా బతికించుకోవాలని ఒక రైతు పడుతున్న ఆవేదన చూపరులను కలచివేస్తోంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో, ఉన్న కొద్దిపాటి నీటితోనే పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన ఆముదాల రమేష్ అనే రైతు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆముదాల రమేష్ ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగుచేశాడు. ఈ ఏడాది…

