TELANGANA

TELANGANA

బీజేపీకి రాజా సింగ్ గుడ్ బై..? కారణం అదేనా..?

క్రమశిక్షణకు మారుపేరైన ఆ పార్టీకి కొరకరాని కొయ్య ఆ నేత. తన మాటలతోనే మంటలను రాజేస్తూ.. సొంత పార్టీ నేతలనే ఉక్కిరి బిక్కిరి చేయడం ఆయనకే చెల్లింది. ఒకసారి మేకప్‌మెన్స్‌ అంటారు. మరోసారి కుర్చీలు తుడిస్తే పదవులు వస్తాయంటారు. మరోసారి తనకు వ్యతిరేకంగా దొంగలంతా ఏకమయ్యాయంటారు. ఇక ఈసారి మాత్రం మరో అడుగు ముందుకేసి సొంత పార్టీ నేతలను ఏకంగా ట్రాన్స్‌జెండర్లతో పోల్చేశారు. ఇలా చాన్స్ దొరికిన ప్రతిసారీ బీజేపీ దుమ్ము దులుపుతున్న ఆ నేత ఎవరు?…

TELANGANA

రాజోలిలో ఇథనాల్ చిచ్చు.. రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత..

జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతులు బుధవారం ఆందోళనను ఉద్ధృతం చేసి, నిర్మాణ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు.. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.   పెద్ద ధన్వాడ వద్ద గాయత్రి కంపెనీ ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ పరిశ్రమ ఏర్పాటును స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.…

TELANGANA

తెలంగాణ కౌరవుల చేతిలో ఉంది.. మల్లారెడ్డి సంచలన వాఖ్యలు..!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మూడేళ్లు ఓపిక పడితే మన రాజ్యం వస్తుందని ఆయన అన్నారు.   సోమవారం జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలో మల్లారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రం కౌరవుల చేతిలో ఉందని, కాంగ్రెస్ నాయకులకు పాలన చేతకావడం లేదని విమర్శించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజలు నిరాశలో ఉన్నారని ఆయన ఆరోపించారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి…

TELANGANA

రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ. కోటి చొప్పున అందుకున్నవారు వీరే..!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సాహితీ, కళా రంగాల్లో విశేష సేవలందించిన తొమ్మిది మంది ప్రముఖులను ఘనంగా సత్కరించింది. ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వీరికి పురస్కారాలు అందజేశారు. ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారాలను అందించారు.   తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలోనూ, సాంస్కృతిక వైభవ వ్యాప్తిలోనూ కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవించే ఉద్దేశంతో ఈ పురస్కారాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.…

TELANGANA

గవర్నర్ తేనీటి విందుకు సీఎం రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సుందరీమణులు..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తాజా ప్రపంచ సుందరి ఓపల్ సుచాత నేతృత్వంలోని సుందరీమణుల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.   గవర్నర్ ఇచ్చిన ఈ తేనీటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), డీజీపీ…

TELANGANA

కాళేశ్వరం విచారణ.. మాజీ సీఎం కేసీఆర్ హాజరు తేదీ మార్పు..!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత సమయం కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కమిషన్, విచారణకు హాజరయ్యే తేదీని మార్పు చేసింది. వాస్తవానికి జూన్ 5న కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉండగా, ఇప్పుడు జూన్ 11న హాజరుకానున్నారు.   కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, నాణ్యత…

TELANGANA

‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం… పోస్టర్ ను ఆవిష్కరించిన వైసీపీ..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూన్ 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. తాడేపల్లిలోని వై‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ‘వెన్నుపోటు దినం’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి…

TELANGANA

కేటీఆర్, కవిత, హరీశ్ మధ్య ఆస్తి గొడవలు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంపై, పార్టీలోని అంతర్గత పరిస్థితులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్, కవిత, హరీశ్ రావు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ విభేదాలు బయటపడి వారు విడిపోకుండా ఉండేందుకే వారంతా కలిసి డ్రామా ఆడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.   కవిత రాసిన లేఖ, హరీశ్ రావు…

TELANGANA

కాళేశ్వరం ప్రాజెక్టును చైనా త్రీ గోర్జెస్ డ్యామ్‌తో పోల్చిన కేటీఆర్..

బలమైన నాయకత్వం, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పం ఉంటే ఎంతటి ప్రగతినైనా సాధించవచ్చని తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ తొమ్మిదేళ్ల పాలనా కాలంలో తెలంగాణ సాధించిన విజయాలు కేవలం దేశానికే పరిమితం కాకుండా, ప్రపంచ దేశాలకు సైతం ఒక నమూనాగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.   లండన్‌లో జరుగుతున్న ‘బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025’ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ‘స్థిరమైన వృద్ధితో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో…

TELANGANA

ఉమ్మడి వరంగల్ కలెక్టర్ల పనితీరుపై మంత్రి పొంగులేటి తీవ్ర అసంతృప్తి..

ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ల పనితీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజలకు అత్యంత కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతుల మంజూరు ప్రక్రియలో నిర్లక్ష్యం తగదని అన్నారు.   లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని, జూన్ 6వ తేదీలోగా అర్హులైన వారి పూర్తి జాబితాను తయారు చేయాలని ఆయన గడువు విధించారు. కేవలం జాబితా మాత్రమే కాకుండా, సంబంధిత ప్రొసీడింగ్స్ కాపీలను కూడా జతచేసి అందించాలని మంత్రి…