ఈ ఐదు ప్రాజెక్టులు సాధిస్తే కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతా: సీఎం రేవంత్ రెడ్డి.
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఐదు ప్రధాన అంశాలపై ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ కమ్ రైల్ ప్రాజెక్ట్, డ్రైపోర్ట్, రక్షణ రంగ ప్రాజెక్టులకు సహకరించాలని, సెమీకండక్టర్ల ప్రాజెక్టు తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఐపీఎస్ ల కొరతపై ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. మూసీ ప్రాజెక్టుకు రూ.20…

