ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లోనూ ఇకపై ప్రీ ప్రైమరీ విద్యను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ప్రవేశాలు కల్పిస్తున్నారు. అయితే, ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం మూడేళ్ల వయసు నుంచే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి ప్రీ…

