తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్ల గడువు పొడిగింపు..
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ’ (దోస్త్) మూడో విడత రిజిస్ట్రేషన్ల గడువును పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు మరియు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపళ్ల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండలి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పొడిగించిన గడువు ప్రకారం, అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అదేవిధంగా, ఆన్లైన్లో వెబ్…

