TELANGANA

TELANGANA

హైదరాబాద్ లో మరో ప్రపంచ స్థాయి సమ్మిట్…

హైదరాబాద్ లో మరో ప్రపంచ స్థాయి సమ్మిట్. ఇంతకీ భారత్ సమ్మిట్ పేరిట జరగనున్న ఈ కార్యక్రమ సరళి ఎలాంటిది? ఇందులో ఎవరెవరు పాల్గొంటారు? ఏయే అంశాలపై చర్చ సాగనుంది? దీని అసలు ఉద్దేశమేంటి? ఆ ఫుల్ డీటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.   కాంగ్రెస్ దార్శనికతను అద్దం పట్టేలా.. భారత్ సమ్మిట్ 2025 ఏప్రిల్ 25, 26వ తేదీల్లో హైదరాబాద్ లోని HICCలో నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. అలీనోద్యమానికి పునాది వేసిన చారిత్రాత్మక బాండుంగ్ సమావేశం…

TELANGANA

అఘోరీ మెడికల్ టెస్టులో అతి భయంకరమైన విషయాలు….

లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఎపిసోడ్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలుకు చేరింది. చీటింగ్ కేసులో చేవెళ్ల కోర్టు అల్లూరి శ్రీనివాస్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. లెక్క ప్రకారమైతే సంగారెడ్డి సబ్ జైలులో ఉంచాలి అఘోరీని. ముందుగా అఘోరీ సంగారెడ్డి సబ్ జైలుకే తీసుకెళ్లారు. కానీ, అఘోరీ ఆడా? మగా? క్లారిటీ కావాలంటూ అక్కడి జైలు అధికారులు రిజెక్ట్ చేశారు. చేసేది లేక పోలీసులు మళ్లీ వైద్య పరీక్షలు చేయించారు.   వైద్య పరీక్షల్లో…

TELANGANA

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్‌డేట్స్..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ ఇందిరమ్మ ఇళ్లు. దీన్ని పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది. ఏ మాత్రం అవకతవకలకు చోటు ఇవ్వకుండా చర్యలు చేపడుతోంది. సమయం తీసుకున్నా, విపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లబ్దిదారుల గుర్తింపునకు ప్లాన్ ప్రకారం వెళ్తోంది.   ఈ క్రమంలో ఈ నెల(ఏప్రిల్) 30లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయనుంది. ఈ మేరకు పైస్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ…

TELANGANA

చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారంలో కొత్త ట్విస్ట్..

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం కలిగి లేనప్పటికీ, తప్పుడు పత్రాలు సమర్పించి గతంలో ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈ ఫిర్యాదు అందజేశారు. చెన్నమనేని రమేశ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ…

TELANGANA

ఆ పోలీసు అధికారుల పేర్లు రాసి పెట్టుకుంటాం..-: కేటీఆర్ హెచ్చరిక

లగచర్ల బాధితులను ఇంకా కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి అధికారుల పేర్లను రాసిపెట్టుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మరో మూడేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అతిగా ప్రవర్తించిన అధికారులు రిటైర్ అయినా, ఎక్కడ ఉన్నా వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల నిర్వహణకు విరాళం అందజేశారు.…

TELANGANA

కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వాఖ్యలు..!

బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా.. అదనంగా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విర్శంచారు. నిజామాబాద్ లో నిర్వహించిన రైతు మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.   ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులను త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మించి ఉంటే ఉమ్మడి…

TELANGANA

వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్..! జపాన్ కంపెనీలకు సీఎం రేవంత్ ఆహ్వానం..

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారితో చర్చించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.   జపాన్ కంపెనీలకు సీఎం రేవంత్ ఆహ్వానం   ఒసాకాలో జరుగుతున్న…

TELANGANA

జపాన్ లో మరో రెండు కంపెనీలతో రేవంత్ రెడ్డి బృందం ఎంవోయూ..

తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా బృందం ఇప్పటికే పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది, ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది.   తెలంగాణ యువతకు విదేశాల్లో, ముఖ్యంగా జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జపాన్‌కు…

TELANGANA

ఎస్ఎల్‌బీసీ సొరంగంలో డేంజర్ జోన్‌లో వ్యర్థాల తొలగింపు కోసం ప్రయత్నాలు..!

ఎస్ఎల్‌బీసీ సొరంగం డేంజర్ జోన్‌కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సొరంగంలో రెండు నెలలుగా సహాయక చర్యలు కొనసాగుతుండగా, డేంజర్ జోన్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులు, సహాయక సిబ్బంది నిరంతరం చర్చిస్తున్నారు.   సొరంగం మార్గంలో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లతో పాటు ప్రమాద సమయంలో ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ యంత్ర భాగాలను ఇదివరకే వెలికి తీశారు. అక్కడి నుంచి మరో 43 మీటర్లను డేంజర్ జోన్‌గా గుర్తించారు.…

TELANGANA

సైబరాబాద్‌పై ఉగ్రదాడికి కుట్ర.. ఎన్ఏఐ నివేదికలో కీలక విషయాలు..

హైదరాబాద్‌లో ఉగ్రదాడికి లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కుట్ర పన్నిందని, ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ వెల్లడించినట్లు ఎన్ఐఏ నివేదిక పేర్కొంది. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్ హుస్సేన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. ఎన్ఐఏ గతంలోనే హెడ్లీని విచారించింది. ఈ విచారణలో హెడ్లీ సంచలన విషయాలు వెల్లడించినట్లు ఎన్ఐఏ నివేదిక ద్వారా తెలుస్తోంది.   తాను ఎల్ఈటీతో కలిసి పనిచేసినట్లు డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగా పలుమార్లు…