సీతక్కకు బెదిరింపు లేఖ.. మావోయిస్టుల కొత్త ట్విస్ట్..!
రాష్ట్ర మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ కొన్ని రోజుల క్రితం విడుదలైన మావోయిస్టుల లేఖ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం విదితమే. అయితే, ఈ వ్యవహారంలో తాజాగా కీలక మలుపు చోటుచేసుకుంది. ఆ లేఖను తాము విడుదల చేయలేదని మావోయిస్టు పార్టీయే స్వయంగా ప్రకటించింది. వారం క్రితం మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. ఇది మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారమైంది. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లోనూ ఆందోళన…

