TELANGANA

TELANGANA

తెలంగాణలో ప్రాణాంతక జిబిఎస్ వ్యాధి.. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు..

దేశంలో గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా జిబిఎస్ కేసులు పెరుగుతున్నందున ఆందోళన వ్యాపిస్తోంది. తాజాగా తెలంగాణలో తొలి GBS కేసు నమోదైంది. హైదరాబాద్‌లో గులియన్-బారే సిండ్రోమ్ కేసును వైద్యులు గుర్తించారు. సిద్దిపేటకు చెందిన ఒక మహిళకు GBS లక్షణాలు కనిపించడంతో, ఆమెను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో GBS కారణంగా గత నాలుగు రోజుల్లో ఒక చిన్నారితో సహా ముగ్గురు మరణించారు. మరోవైపు, మహారాష్ట్రలోని పుణేలో దాదాపు 130 జిబిఎస్…

TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికల సమరం..? ఫస్ట్ వీక్‌లో ఎన్నికలపై క్లారిటీ..

స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టిందా? వచ్చేవారం రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీ ముందుకు రానుందా? రాష్ట్రంలో 55 శాతం బీసీలు ఉన్నట్లు తేలిందా? రిజర్వేషన్లు పెంపుపై లీగల్ ఒపీనియన్‌కు సిద్ధమవుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దాదాపు పూర్తి అయ్యింది. డేటా ఎంట్రీ పూర్తి కావడంతో మరో రెండురోజుల్లో ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్‌లో సర్వేపై అధికారులు,…

TELANGANA

వరల్డ్ క్లాస్ టెక్నాలజితో ఉస్మానియా కొత్త ఆసుపత్రి.. 31న శంకుస్థాపన..

అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టెక్నాలజీతో రానుంది కొత్త ఉస్మానియా హాస్పిటల్‌. వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. డిజైన్లు దాదాపు ఖరారు కావడంతో శుక్రవారం (జనవరి 31)న నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.   ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనాల డిజైన్లపై బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. దీనికి ఆరోగ్య, ఆర్ అండ్…

TELANGANA

అధికారులను ప్యాలెస్ కు పిలిపించుకుని అహం ప్రదర్శిస్తున్నావు.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన అన్నావని, సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నావని, ప్రజలను ప్రతిరోజు కలుస్తా అన్నావని… కానీ ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చాటేశావని హరీశ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లోని ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన కొనసాగిస్తున్నావని దుయ్యబట్టారు.   ముఖ్యమంత్రి, మంత్రులు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే చోట ఉండే సువిశాలమైన…

TELANGANA

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. వెలుగులోకి మరిన్ని దారుణాలు..!

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసిన విషయం ఇటీవల బయటపడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ విషయం మరువక ముందే, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ముఠాలోని కీలక…

TELANGANA

16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ హైకోర్టు పదహారేళ్లలోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.   సినిమా టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి అంశంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు…

TELANGANA

రేవంత్ సర్కార్ కు షాక్.. ఇందిరమ్మ ఆత్మీయ భారోసాపై హైకోర్టులో పిల్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించిన మరుసటి రోజే తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ ఈ పథకం పైన హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.   ఇందిరమ్మ ఆత్మీయ భారోసాపై హైకోర్టులో పిల్ నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి…

TELANGANA

రైతు భరోసా నిధుల జమ- విడతల వారీగా, తాజా నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేస్తోంది. చెప్పిన విధంగానే రిపబ్లిక్ రోజున సీఎం రేవంత్ నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. ప్రారంభం రోజు ఆదివారం కావడంతో రైతు భరోసా డబ్బులు జమకావని తేల్చి చెప్పారు. అర్ధరాత్రి తరువాత రైతుల ఖాతాల్లో నిధుల జమ మొదలైంది. ప్రభుత్వం ఖరారు చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులైన రైతులకు నిధులు అందనున్నాయి. అయితే, గతంలో అమలు చేసిన…

TELANGANA

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్దం అవుతున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించాయి. ఈ సాయంత్రం ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాల ని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల కాలం తరువాత తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. దీంతో, ప్రభుత్వం అలర్ట్ అవుతోంది.   తెలంగాణ ఆర్టీసీ…

TELANGANA

తెలంగాణలో బెనిఫిట్ షోలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం నడుచుకోవాలని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.   సినిమా టిక్కెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతులపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది.   ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు తెలిపారు.   వాదనలు విన్న…