TELANGANA

TELANGANA

మంద కృష్ణ మాదిగ అక్రమ కట్టడాల కూల్చివేత…

వరంగల్ జిల్లాలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు చెందిన అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. హన్మకొండలోని హంటర్ రోడ్డు సర్వే నెంబర్ 125కేలోని ఆయన కట్టడాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సిబ్బంది నిన్న కూల్చివేశారు.   హంటర్ రోడ్డులో గల తమ 400 గజాల భూమిని మంద కృష్ణతో పాటు జ్యోతి, ఇద్దయ్యలు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారని రెండున్నరేళ్ల క్రితం నంబూరి చారుమతి అనే మహిళ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరిపి…

TELANGANA

మహిళా కలెక్టర్‌ను అవమానించారు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కవిత డిమాండ్..

మహిళా కలెక్టర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవమానించారని, ఇందుకు మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు తక్షణమే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో మహిళా కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మీద మంత్రి చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన కవిత… తీవ్రంగా స్పందించారు.   ఇది కాంగ్రెస్‌ నాయకుల అహంకారానికి పరాకాష్ఠ అని…

TELANGANA

హైదరాబాద్ లో ఘోరం… భార్యను చంపి కుక్కర్ లో ఉడికించాడు..!

తన భార్యను హత్య చేయడమే కాక మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించి, ఆ తర్వాత ఆ అవశేషాలను చెరువులో పడవేశాడు ఓ రాక్షసుడు. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లు భార్య వెంకట మాధవి కనిపించడం లేదని అత్త సుబ్బమ్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.   వివరాల్లోకి వెళితే.. జిల్లెలగూడ న్యూ వెంకటరమణ…

TELANGANA

హైదరాబాద్ లో విప్రో భారీ విస్తరణ.. దావోస్ వేదికగా ప్రకటన..

ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో మరో ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్…

TELANGANA

తెలంగాణలో మేఘా భారీ పెట్టుబడులు..

ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సు సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందంతో ప్రముఖ సంస్థలు చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మేఘా ఇంజనీరింగ్ (ఎంఇఐఎల్) కంపెనీతో తెలంగాణ సర్కార్ మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.   మొత్తం రూ.15 వేల కోట్లతో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఉత్పత్తి ప్రాజెక్టు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు, అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి…

TELANGANA

ఇవి గ్రామసభలా… ఖాకీల క్యాంప్ లా?: కేటీఆర్..

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలయిందని ఆయన అన్నారు. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయిందని… అసమర్థ ముఖ్యమంత్రి అసలు స్వరూపం బట్టబయలైందని చెప్పారు. ఇక కాలయాపనతో కాలం సాగదని… అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదని అన్నారు. రేషన్ కార్డులకు సంబంధించి ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.   “ఈ దరఖాస్తుల దందా నడవదు. ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదు.…

TELANGANA

సింగపూర్ కంపెనీతో కీలక ఒప్పందం.. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ సింగపూర్ పర్యటన మంచి ఫలితాలు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది క్యాపిటల్యాండ్ కంపెనీ.   తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల వేట కొనసాగుతోంది. పెట్టుబడుల ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. మంచి ఫలితాలు రాబడుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి టీమ్, సింగపూర్…

TELANGANA

కటింగులు, కటాఫ్ లు మినహా ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమిటి?: కేటీఆర్..

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. కటింగులు, కటాఫ్ లు మినహా ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగిందేమిటని ప్రశ్నించారు. రుణమాఫీ కటింగ్, రైతు భరోసా కటింగ్, సాగునీళ్లు కటింగ్, కరెంటు కటింగ్, కేసీఆర్ కిట్ కటింగ్, న్యూట్రిషన్ కిట్ కటింగ్, తులం బంగారం కటింగ్, మహాలక్ష్మి రూ. 2,500 కటింగ్, ఫించను రూ. 4,000 వేలు కటింగ్, రూ. 5 లక్షల…

TELANGANA

ఫార్ములా -ఈ రేస్ కేసు.. ఏసీబీ ముందుకు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు..

ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఈనెలాఖరులోగా విచారణ పూర్తి అవుతుందా? ఇటు ఏసీబీకి.. అటు ఈడీకి చిక్కిన, లభించిన ఆధారాలేంటి? ఈ కేసులో ఏసీబీ ముందు ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులు హాజరవుతున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.   ఫార్మాలా ఈ రేసు కుంభకోణంలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈ కేసు ప్రారంభంలో మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్‌రెడ్డి పేర్లు బయటకు…

TELANGANA

ఇంటర్ సిలబస్‌లో మార్పులు.. ఏఐ, డేటా సైన్స్‌కు చోటు..?

ఇంటర్ సిలబస్‌లో మార్పులు-చేర్పులు జరుగుతున్నాయా? మారిన సిలబస్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుందా? కొన్ని పాఠాలను తొలగించాలని ఇంటర్ బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుందా? రాబోయే కొత్త పాఠాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామంది స్టూడెంట్స్‌ను వెంటాడుతోంది.   మారుతున్న కాలానికి అనుగుణంలో ఇంటర్ విద్యలో మార్పులు చేయాలని తెలంగాణ బోర్డు ఆలోచన చేస్తోంది. ఇప్పటికే వేసిన కమిటీ కసరత్తు చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, ఆర్ట్స్‌లో కొన్ని పాఠాలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. వాటి…