TELANGANA

TELANGANA

సింగపూర్‌లో సీఎం రేవంత్ టీమ్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. గురువారం రాత్రి సింగపూర్‌కు చేరుకున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు అక్కడ పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.   తొలుత సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాల నుంచి ఇరువురు చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య- నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ…

TELANGANA

లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? ఎవరు దొంగో తేలుతుంది.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

ఎన్ని ప్రశ్నలు అడిగినా… ఎన్నిరకాల పరీక్షలు పెట్టినా తాను భరిస్తానని… మరి సీఎం రేవంత్ రెడ్డి లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. తమపై ఉన్న కేసులకు సంబంధించి తామిరువురం ఒకేచోట కూర్చొని అధికారులు, ప్రజలు చూస్తుండగా ప్రశ్నిస్తే… అప్పుడు దొంగ ఎవరో తేలుతుందన్నారు. విచారణ అనంతరం ఆయన ఈడీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.   రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు ఉందని, అందుకే తనపై కూడా ఏసీబీ…

TELANGANA

ప్రతి పైసాకు నా దగ్గర లెక్కుంది.. KTR సంచలన వ్యాఖ్యలు…

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ రేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో ఎలాంటి నిబంధనలు పాటించకుండా రూ.55కోట్లు ఎలా బదలీ చేస్తారనే ఆరోపణలు ప్రధానంగా ఆయన ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. కాసేపట్లో ఆయనను ఈడీ అధికారులు విచారించనున్నారు.   అయితే ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్‌ను జనవరి 9న విచారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన…

TELANGANA

తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక .. నేడు జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్..

నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల స్వప్నం నేడు నెరవేరుతోంది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ (ఇందూరు)లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ గత ఎన్నికల సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీ నెరవేరుతోంది.   గత ఏడాది అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ జాతీయ పసుపు బోర్డుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, తాజాగా…

TELANGANA

భూములు తీసుకోవద్దంటూ పొలాల్లో సకినాలు చేస్తూ నిరసన

రింగ్ రోడ్డు కోసం తమ భూములు తీసుకోవద్దంటూ వరంగల్ జిల్లాలో కొందరు రైతులు సకినాలతో నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా వరంగల్ మండలంలోని ఆరెపల్లి – పైడిపల్లి – కొత్తపేట గ్రామాల మీదుగా 200 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.   ఈ ప్రతిపాదన కారణంగా తాము విలువైన భూములను కోల్పోతున్నామంటూ వరంగల్ మండలం ఆరెపల్లి శివారులోని పంట భూముల్లో…

TELANGANA

కౌశిక్ రెడ్డి తీరుపై KCR, KTR స్పందించాలి: మంత్రి పొన్నం..

కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడేందుకు లేచిన సమయంలో కౌశిక్ రెడ్డి ఆయనకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం మొదలైంది. నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్ కుమార్‌ను కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం నెట్టుకున్నారు.   గొడవ ఎక్కువవ్వడంతో కౌశిక్ రెడ్డిని…

TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై మూడు కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించారని.. అయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు. జిల్లా కలక్టరేట్ లో అధికారిక సమావేశంలో గందరగోళం సృష్టించి, మీటింగ్ ని పక్కదారి పట్టించారని…

TELANGANA

వారికి రైతు భరోసా బంద్.. కలెక్టర్లకు తేల్చి చెప్పిన సీఎం రేవంత్..

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.   డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు…

TELANGANA

కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. ఏసీబీ విచారణకు సంబంధించిన విషయాలపై ఆరా..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో గురువారం కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏసీబీ విచారణకు సంబంధించిన విషయాలను కేసీఆర్‌కు కేటీఆర్ వివరించారు.   ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలు పదే పదే అడిగారని, విచారణకు పూర్తిగా సహకరించానని కేటీఆర్.. కేసీఆర్‌కు వివరించారు. ఈ భేటీలో మాజీ మంత్రి హరీశ్ రావతోపాటు…

TELANGANA

‘భూ భారతి’కి గవర్నర్ ఆమోదం.. రానున్న మార్పులివే..

గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ భారతి బిల్లుకు గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ ఆమోద ముద్ర వేశారు. గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన బిల్లు కాపీని గురువారం స‌చివాల‌యంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. వీలైనంత త్వరలో ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇందుకోసం అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్ర‌జానీకానికి మెరుగైన‌, స‌మ‌గ్ర‌మైన…