నేడు బెలగావికి వెళుతున్న రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. బెలగావిలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి కూడా బెలగావికి వెళ్లనున్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెలగావికి చేరుకుంటారు. ఈ ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి వీరు బయల్దేరుతారు. ఈ మధ్యాహ్నం 3…

