TELANGANA

TELANGANA

‘తెలంగాణ రైజింగ్’ అంటే ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడమేనా..: హరీష్ రావు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యం ధరలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. బీర్లను, బార్లను నమ్ముకుని, మద్యం అమ్మకాల ద్వారా ఖజానా నింపుకోవడమే ‘మార్పు’ అని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలి, కేవలం ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి సారించిందని, “ఎక్సైజ్ ఆదాయంలో ‘తెలంగాణ రైజింగ్’ అంటే ఇదేనా?” అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.   హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను అటకెక్కించి,…

TELANGANA

నకిలీ వైద్యులపై వేటు వేసిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్..!

తెలంగాణలోని పలు నగరాలు, పట్టణాల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ తరహా వైద్యులు పుట్టుకొస్తున్నారు. అర్హత లేకున్నా నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతూ ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో కొంతకాలం సహాయకులుగా పనిచేసి, ఆ తరువాత వైద్యులుగా అవతారమెత్తుతున్నారు. ఎలాంటి అర్హత లేకుండానే రోగులకు యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ వంటి మందులు ఇస్తున్నారు.   ఈ క్రమంలోనే అర్హత లేని వైద్యుడు, అనుమతులు లేని ఆసుపత్రిలో ఓ మహిళకు శస్త్రచికిత్స చేయగా, వైద్యం వికటించి…

TELANGANA

సిద్దిపేట జవాన్‌ భూ కబ్జా ఆరోపణ.. వీడియో షేర్ చేసిన హరీశ్ రావు..!

దేశ రక్షణలో పాలుపంచుకుంటున్న ఓ సైనికుడి భూమి కబ్జాకు గురైందంటూ వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే ఆర్మీ జవాను, తన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమంలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు వెంటనే స్పందించారు.   జవాన్ రామస్వామి ఎదుర్కొంటున్న సమస్యను ఆయన తీవ్రంగా…

TELANGANA

మూసి వరదలపై హైడ్రా ఫోకస్..!

అసాధారణమైన వర్షాలకు హైదరాబాద్‌ అతలాకుతలం అవుతోంది. గట్టిగా వాన పడిందంటే చాలు.. భాగ్యనగరం సంద్రంగా మారుతుంది. ఈ క్రమంలో నగరానికి వ‌ర్షాకాల వ‌ర‌ద‌ముప్పు త‌ప్పించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై హైడ్రా మేధోమ‌ధ‌నం చేసింది. మూసీన‌ది సరిహద్దు గుర్తింపు, ORR లోపల నాలా నెట్‌వ‌ర్కులతో పాటు మూసీ వెడ‌ల్పుల‌ నిర్ధారణ అనే అంశంపై హైడ్రా స‌ద‌స్సు నిర్వహించింది.   మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం హైడ్రాకు లేన‌ప్పటికీ.. మూసీ ఆక్రమ‌ణ‌ల‌పై హైడ్రాకు అందుతున్న ఫిర్యాదుల నేప‌థ్యంలో.. అస్సలు ఆ…

TELANGANA

ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం..! ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్..

ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. మూడు రోజుల పాటు ప్రశ్నించిన సిట్ బృందం.. వీరి ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. ఈ రోజు మార్నింగ్ నుంచి ఏకధాటిగా 9 గంటల పాటు సిట్ ఇద్దరినీ విచారించిన విషయం తెలిసిందే.   రేపు వీరి ఇద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200…

TELANGANA

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..! మరో కొత్త పథకం..

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా పోడు రైతులకు ఇది ఊహించని తీపి కబురు. రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతుల కోసం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం అమలు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా 6 లక్షల ఎకరాల భూములకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్‌ మండలంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.   ఇందిర సౌర గిరి జల…

TELANGANA

మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్స్..

తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ అనగానే గుర్తుకొచ్చేవారిలో మంత్రి కొండా సురేఖ ఒకరు. తనకు ఏదైనా తెలుస్తే ఓపెన్‌గా బయటపెడతారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు. అవే ఒక్కోసారి ఆమెకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి కూడా. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..   మంత్రి కొండా సురేఖ గురించి చెప్పనక్కర్లేదు. మనసులో ఏమీ దాచుకోకుండా నిజాన్ని ఓపెన్‌గా చెప్పేస్తారు. ఆ తర్వాత ఎవరు…

TELANGANA

సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్.. కాళేశ్వరంలో ఘనంగా ఏర్పాట్లు..

దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి.ఇప్పటికే త్రివేణి సంగమం దగ్గర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి శ్రీధర్‌ బాబు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరు రాష్ట్రాల నుంచి దాదాపు 50లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.   ఉదయం 5.44…

TELANGANA

సీఈ రమణారెడ్డికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్..!

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో మహబూబ్‌నగర్‌ జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ (సీఈ) రమణారెడ్డికి సీఎం తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. “అక్కడ (గతంలో పనిచేసిన చోట) చేసినట్లు ఇక్కడ కూడా చేస్తే కేసు పెట్టి లోపల వేయిస్తా” అంటూ సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. రమణారెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో…

TELANGANA

రైతులు చస్తున్నా అందాల పోటీలలో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి : కేటీఆర్

ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతన్నల కష్టం మాత్రం తీరడం లేదు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, పంటలు పండించి ధాన్యపు రాశులను మార్కెట్ కు తరలించిన సకాలంలో కొనుగోలు చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క అకాల వర్షాలు, ఓ పక్క మండుటెండలు అన్నదాతలను విలవిలలాడేలా చేస్తున్నాయి.   మళ్లీ అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. అంతేకాదు కొంతమంది అన్నదాతలు పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కు వెళ్లి వడ దెబ్బతో మృతి చెందుతున్న…