TELANGANA

TELANGANA

తెలంగాణ తల్లి తలపై కిరీటం ఎందుకు పెట్టలేదో చెప్పిన అందెశ్రీ..

దేవత రూపానికైతే కిరీటం ఉంటుందని, కానీ అమ్మరూపానికి ఉంటుందా? అని ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాలో బతుకమ్మతో పాటు కిరీటం లేకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కిరీటం లేకపోవడంపై ఎన్టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అందెశ్రీ స్పందించారు. బాసర సరస్వతీమాతను దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.   తెలంగాణ తల్లికి కిరీటం ఉండాలంటే… భూమి మీద పురుడు పోసుకున్న ఏ తల్లికి కిరీటం ఉంటుందో చెప్పాలన్నారు. కిరీటాలు పెట్టుకుంటే…

TELANGANA

తెలంగాణ సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం..

తెలంగాణ సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. డిసెంబరు 12వ తేదీ నుంచి రాష్ట్ర సచివాలయంలో ఈ నిబంధన అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.   స‌చివాల‌యంలో ప‌ని చేసే అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బందికి ఈ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం వర్తిస్తుందని ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్, స‌చివాల‌యం హెడ్ నుంచి వేత‌నాలు పొందే ప్ర‌తి ఉద్యోగికి వర్తిస్తుందని స్పష్టం చేశారు.

TELANGANA

చెన్నమనేని రమేష్‌పై హైకోర్టు ఆగ్రహం..

బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఎట్టకేలకు షాక్ తగిలింది. పౌరసత్వం కేసులో చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ దేశ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని స్పష్టం చేసింది. కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.   జర్మనీ పౌరసత్వంతోనే ఆయన అక్కడికి వెళ్లారని పేర్కొంది. అంతేగాక, చెన్నమనేని…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు.. ప్రభాకర్‌ పై హరీష్ రావు ఒత్తిడి..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు పోలీసులు. కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్‌కు సంబంధించిన ఈ కౌంటర్ అఫిడవిట్‌లో కీలక విషయాలు పొందుపరిచారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి నలుగురు నిందితులు బేగంపేట ఎస్ఐబీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు పోలీసులు. బేగంపేట హరిత ప్లాజా, మ్యారీ గోల్డ్ హోటల్, జూబ్లీహిల్స్‌లోని శ్రవణ్ రావు ఇంట్లోనూ పలు అంశాలపై చర్చించేందుకు వీరు భేటీ అయ్యారని వివరించారు.   బీఆర్ఎస్ సర్వేతో…

TELANGANA

రేపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎల్లుండి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.   ఏం విగ్రహమంటూ కేటీఆర్ ఆగ్రహం   సచివాలయంలో ఏర్పాటు చేస్తోంది తెలంగాణ తల్లి విగ్రహమా? లేక కాంగ్రెస్ తల్లి విగ్రహమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

TELANGANA

తెలంగాణ తల్లికి కొత్త రూపం.. విగ్రహం ప్రత్యేకతలు ఇవే, ఈ నెల 9న ఆవిష్కరణ..

పచ్చచీర గట్టి, కంకి చేతబట్టి అభయహస్తంబు చూబుతూ పిడికిలి గురుతులున్న పాదపీఠంబెక్కి నిండు ముత్తయిదువోలె కనులపండువలా కనిపిస్తోంది తల్లీ తెలంగాణ. తల్లీ నీకివే మా పాదాభివందనాలంటూ.. అందరూ చేతులెత్తి మొక్కేలా ఉంది తెలంగాణ తల్లి విగ్రహం. సరికొత్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.   తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ…

TELANGANA

కోటి మంది మహిళాలను కోటీశ్వరులను చేస్తా.. సీఎం రేవంత్ రెడ్డి..

మహిళా సంక్షేమానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల శిల్పారామంలో నూతనంగా ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి మహిళా శక్తి బజార్ ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ఇతర మంత్రులు అధికారులు పాల్గొన్నారు.   ఇందిరా మహిళా శక్తి బజారు…

TELANGANA

ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ ఆవిష్కరించిన సీఎం రేవంత్‌….

బీఆర్ఎస్‌ను ప్రజలు దూరం పెట్టినా ఆ పార్టీలో ఎలాంటి మార్పు రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లున్నారు. సభలో పాలకపక్షం- విపక్షం సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విపక్ష నేత సభకు రావడం లేదన్నారు.   సభకు వచ్చి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టాలన్నారు సీఎం. మీ అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని సూచన చేశారు. ప్రభుత్వాన్ని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారా? అంటూ సున్నితంగా ప్రశ్నించారు. మీ పిల్లలిద్దర్నీ…

TELANGANA

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేసిన పోలీసులు..

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ.. ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ విధుల్లో గల సీఐకు కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వివాదం సాగింది. తాను ప్రస్తుతం ఇతర…

TELANGANA

నేడే ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఆవిష్కరణ.. కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..

సచివాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. విజయోత్సవాల్లో భాగంగా సినీ రంగ ప్రముఖులతో మ్యూజికల్ నైట్, నగరంలోని ప్రముఖ హోటళ్లు, డ్వాక్రా, రెస్టారెంట్లు, సంస్థలచే స్టాళ్ళ ఏర్పాటు, భారీ ఎత్తున డ్రోన్ షో, లేజర్ షో, క్రాకర్స్ షో జరగనున్నాయి. వీటన్నింటిపై రివ్యూ చేశారు సీఎస్. 7 వ తేదీన వందేమాతరం శ్రీనివాస్ బృందం, 8న రాహుల్ సిప్లిగంజ్, 9న థమన్‌తో సినీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అదే…