‘భూ భారతి’కి గవర్నర్ ఆమోదం.. రానున్న మార్పులివే..
గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ భారతి బిల్లుకు గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోదించిన బిల్లు కాపీని గురువారం సచివాలయంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. వీలైనంత త్వరలో ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇందుకోసం అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రజానీకానికి మెరుగైన, సమగ్రమైన…

