TELANGANA

TELANGANA

మహిళలకు నెలకు రూ.2500.. ఎప్పటి నుంచి అంటే..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారమే అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.   అలాగే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10…

TELANGANA

ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఉండదా..?

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది. సీనియర్లు సైతం కేసీఆర్‌, ఆయన పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో చేరుతున్నారు.   ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తం అయ్యారు కేసీఆర్. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించడానికి ఉద్దేశించిన పర్యటనలు ఇవి. కరవుతో…

TELANGANA

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా: ఎందుకంటే..?

ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఈ ప్రక్రియను జూన్ 2వ తేదీకి వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాగా, గత గురువారం ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.   ఉమ్మడి జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ,…

TELANGANA

ఎండిపోయిన ప్రతి ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం.. కేసీఆర్ డిమాండ్..

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు చేసే సమయం ఉందికానీ.. రైతులకు రైతు బంధు వేసే తీరక లేదని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం సెట్ కావడానికి కాస్త సమయం ఇచ్చామని.. ప్రస్తుతం 4 నెలల సమయం అయినందునే ప్రశ్నిస్తున్నామని అన్నారు.   రాష్ట్రంలో నెలకొన్న నీటి, విద్యుత్ సమస్యకు కారకులెవరని ప్రశ్నించారు. దేశంలో ఉన్న నెంబర్ 01గా ఉన్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇంత…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికా నుంచి వస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ..!

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఆయన కేంద్రంగా ఈ వ్యవహారం సాగిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సోమవారం ఆయన హైదరాబాద్ వస్తున్నారని తెలుస్తోంది.   ప్రభాకర్ రావును ప్రశ్నిస్తే కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఆయన వెల్లడించే సమాచారం ఆధారంగా బీఆర్ఎస్ నాయకులు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ప్రభాకర్…

TELANGANA

తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే….

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీ-కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేస్తామని రాష్ట్ర అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లును ఏఐసీసీ నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపా దాస్ మున్షీ ప్రకటించారు. ఈ జాబితాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.   తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు…

TELANGANA

అడిషనల్ ఎస్పీలు సస్పెన్షన్.. తర్వాత ఎవరు..!

ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం రాజకీయ నాయకులవే కాకుండా వ్యాపారులు, సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలు అరెస్టులు కూడా జరిగాయి. తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది.   వీరిద్దరు 48 గంటలు పోలీసుల అదుపులో ఉండడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు…

TELANGANA

రైతుబంధు, రుణమాఫీ అమలు – రేవంత్ సర్కార్ తాజా ప్రకటన..!!

తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవటమే లక్ష్యంగా రేవంత్ అడుగులు వేస్తున్నారు. గ్యారంటీల అమలు నిర్ణయాలు వేగంగా తీసుకున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతు రుణమాఫీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో ఈ విషయం పైన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టత ఇచ్చారు. అమలు పైన క్లారిటీ ఇచ్చారు.   రుణమాఫీ పై నిర్ణయం ఎన్నికల సమయంలో కాంగ్రెస్…

TELANGANA

అష్టదిగ్బంధనం – బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గులాబీ అధినేత రాజకీయంగా వరుస ఎదురు దెబ్బలు తింటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ వెంట నడిచిన సీనియర్లు కాంగ్రెస్ బాట పట్టారు. దీంతో, గులాబీ పార్టీ కుదేలవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.   వరుస షాక్ లతో బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు.…

TELANGANA

జైల్లో చిప్పకూడే.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం గాంధీభవన్‌లో వాల్మీకి, బోయలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ ముగియగానే వాల్మీకి, బోయల డిమాండ్లు నెరవేరుస్తామన్నారు. గద్వాల్, ఆలంపూర్ ప్రాంతంలోని బోయల గురించి తనకు తెలుసన్నారు. ఇప్పుడు అందరూ ఒకవైపు రండి.. మన ప్రభుత్వం ఉందన్నారు.   ఢిల్లీలో కూడా మన పరిపాలనను అభినందిస్తున్నారని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఎవరు ఏ…