TELANGANA

TELANGANA

సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)కు ఇటీవలే సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిపై స్పందించిన కవిత ఆదివారం సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కాలేనని లేఖలో స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల దృష్యా సీబీఐ నోటీసులు జారీ వల్ల అనేక ప్రశ్నలకు తావిస్తోందని కవిత తెలిపారు.   ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున విచారణకు రావడం అవరోధంగా ఉందని కవిత తెలిపారు.…

TELANGANA

“గృహలక్ష్మి” నిబంధనలు ఖరారు – అమలయ్యేది వీరికే..!!

తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీల అమలు పై వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తోంది. మరో రెండు అమలు కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఆరు గ్యారెంటీల్లోని రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఒక్కో కుటుంబానికి రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలను 27న ప్రారంభిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో గృహలక్ష్మి అమలు నిబంధనలు ఖరారయ్యాయి.   మరో రెండు గ్యారంటీల అమలు: తెలంగాణ ప్రభుత్వం హామీ…

TELANGANA

ధరణిపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు- సమగ్ర విచారణకు ఆదేశాలు ..

ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మార్చి మొదటి వారంలోనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించడానికి ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రావాలని చెప్పారు.   ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా…

TELANGANA

నిందితురాలిగా కవిత..ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిన సీబీఐ..

సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఆమె చుట్టూ సీబీఐ ఉచ్చు పన్నినట్టే కనిపిస్తోంది.   ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు కవితకు ఇదివరకే సమన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన విచారణకు రావాల్సి ఉంటుందంటూ ఆదేశాలు ఇచ్చారు.…

TELANGANA

మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న రేవంత్.. మరో 2 పథకాలపై కీలక ప్రకటన..

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న సీఎం.. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఇక్కడ్నుంచే ప్రారంభించినట్లు గుర్తు చేశారు.   మేడారం జాతరలో భక్తులకు ఇబ్బందులు రాకుండా రూ. 110 కోట్లు మంజూరు చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. మేడారం జాతరపై కేంద్రం వివక్ష…

TELANGANA

విద్యుత్ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్..

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు.   గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని సీఎం చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖ అధికారులపై…

TELANGANA

రూ. 500కే గ్యాస్, ఫ్రీ కరెంట్ పథకాల అమలుకు డేట్ ఫిక్స్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు గ్యారంటీల అమలుకు రేవంత్ రెడ్డి సర్కారు మరో ముందుడు వేసింది. గృహజ్యోతి(200 యూనిట్వ వరకు ఉచిత విద్యుత్), రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఫిబ్రవరి 27 లేదా 29న ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్సబ్కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.   మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సీఎం…

TELANGANA

జనసంద్రంగా మేడారం.. మహాజాతర ప్రారంభం..

మేడారం జనసంద్రంగా మారింది. ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. నేడు, రేపు కూడా భారీగా భక్తులు తరలొచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు సారలమ్మ గద్దె మీదకు రానున్నారు. గిరిజన పూజారులు కన్నెపల్లి నుంచి సారలమ్మను, పూనగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకురానున్నారు. మేడారానికి ఇప్పటికే 15 లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది.   బుధ, గురువారం ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఈ రోజు సాయంత్రం కన్నెపల్లిలోని…

TELANGANA

ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు సమన్లను జారీ..

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో మరోసారి విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థిితి ఏర్పడింది.   ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు కవితకు సమన్లను జారీ చేశారు. ఈ నెల 26వ తేదీన విచారణకు రావాల్సి ఉంటుందంటూ ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు…

TELANGANA

బీఆర్ఎస్‌తో పొత్తా..?: చెప్పులు చూపించమన్న బండి సంజయ్..

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 370 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.   జమ్మూకశ్మీర్లో 370 ఆర్టికల్‌(Article 370) రద్దు చేసినందుకు 370 సీట్లు కమలం ఖాతాలో వేయాలని కోరారు. బీజేపీ వెనుక రాముడు,…