సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)కు ఇటీవలే సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిపై స్పందించిన కవిత ఆదివారం సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కాలేనని లేఖలో స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల దృష్యా సీబీఐ నోటీసులు జారీ వల్ల అనేక ప్రశ్నలకు తావిస్తోందని కవిత తెలిపారు. ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున విచారణకు రావడం అవరోధంగా ఉందని కవిత తెలిపారు.…

