TELANGANA

TELANGANA

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ గుడ్‌న్యూస్…

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రాలకు నిమిషం ఆలస్యం నిబంధన తొలగించింది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు 5 నిమిషాలు గ్రేస్ టైం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.     ఇప్పటి వరకు 9 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను అనుమతించని అధికారులు. తాజా నిర్ణయంతో విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది. అనేక మంది విద్యార్థులు ఒక నిమిషం నిబంధనతో పరీక్షలకు దూరమవుతున్న…

TELANGANA

మేడారం హుండీల లెక్కింపు.. అంబేద్కర్‌ ఫొటో నోట్ల కలకలం…!

మేడారం హుండీల లెక్కింపు జరుగుతోంది. నాలుగు రోజులపాటు జరిగిన జాతరలో భక్తులు కానుకలు సమర్పించారు. అయితే హుండీల లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు రావడం కలకలం రేపింది. విచిత్రంగా నకిలీ కరెన్సీపై రాజ్యాంగ నిర్మాత బీఆర్‌.అంబేద్కర్‌ ఫొటో ఉండడం గమనార్హం. ఇలా అంబేద్కర్‌ ఫొటో ఉన్న రూ.100 కరెన్సీ నోట్లు ఎక్కువగా కనిపించాయి.   అంబేద్కర్‌ ఫొటో ముద్రణకు డిమాండ్‌.. హుండీల్లో వేసిన ఈ కరెన్సీ నోట్ల వెనుక పలువురు భక్తులు భారత కరెన్సీపై అంబేద్కర్‌ ఫొటో…

TELANGANA

బస్తీ మే సవాల్.. మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా రేవంత్.. తొడగొట్టిన కేటీఆర్.!

‘రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా. ఢిల్లీకి బ్యాగులు మోసేందుకే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదు. జీవో 111 రద్దుకు అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. ప్రజాభిప్రాయం మేరకే మేం ఎత్తివేశాం. ప్రస్తుతం మా దృష్టి పూరి‍్తగా తెలంగాణపైనే. కాంగ్రెస్‌ నేతలు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒక్క ఎన్నికల్లో గెలిస్తే మగాడా? ఓడితే కాదా? రేవంత్‌ను ఏదో భయం వెంటాడుతోంది. మగాడివైతే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. మహిళలకు…

TELANGANA

తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ: షెడ్యూల్ ఇదే..

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, యాత్రలు చేస్తున్నాయి. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు ప్రచార జోరును పెంచారు. రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దిగుతున్నారు.   ఇప్పటికే ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలు చేస్తోంది…

TELANGANA

ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం..

ఔటర్ రింగ్ రోడ్డు(ORR) ఓఆర్‌ఆర్‌ టోల్ టెండర్లలో అవకతవకలపై విచారణ చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఓఆర్ఆర్ టోల్ టెండర్ల పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణను సీబీఐ లేదా మరో సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.   బుధవారం హెచ్ఎండీఏ భవన్‌లో నిర్వహించిన సమీక్షలో ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో భారీగా అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర నివేదిక…

TELANGANA

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుండగా.. మార్చి 28న పోలింగ్ జరగనుంది.   ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక…

TELANGANA

రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన రేవంత్..

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక కష్టాలున్నా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నామని, తాజాగా మరో రెండు పథకాలు ప్రారంభించుకున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మిగతా హామీలు కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.   కాగా, అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు పథకాన్ని అమలు…

TELANGANA

ఎల్ఆర్ఎస్‌పై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం..

తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) దరఖాస్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది గత మూడున్నరేళ్ల ఎదురుచూపులకు తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఆదాయ సమీకరణ, వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.   ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా మొత్తం రుసుం చెల్లించిన దరఖాస్తుదారులకు లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.…

TELANGANA

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించారని.. రూ. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఇవాళ అప్పులపై వడ్డీలకే ఏటా రూ. 70 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం దేశంలో మరెవరూ లేరని కేసీఆర్‌ను దుయ్యబట్టారు.   సింగరేణి కార్మికులకు రూ. కోటి ప్రమాద…

TELANGANA

బీఆర్ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి తీగల కృష్ణారెడ్డి…

లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒకరికొకరు పార్టీని వీడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరితోపాటు ఎంపీటీసీలు, సర్పంచులు కూడా రాజీనామా సమర్పించారు.   ఫిబ్రవరి 27న చేవెళ్లలో జరగబోయే సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్నట్లు…