ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన కేటీఆర్..
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న పోన్ ట్యాపింగ్ కేసుపై కేటీఆర్ తొలిసారిగా స్పందించారు. కాంగ్రెస్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపిస్తుందని.. ఒక వేళ చేస్తే ఒక్కరో ఇద్దరివో ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండవచ్చని కేటీఆర్ అన్నారు. దాని గురించి తనకేం తెలుసని ప్రశ్నించారు. దొంగల ఫోన్లు ట్యాప్ చేయండం పోలీసుల పని అని పేర్కొన్నారు. కేటీఆర్ మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్నారు. హస్తం పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాలం గడువుతుందని కేటీఆర్ విమర్శించారు.…

