మేడారం జాతర హుండీ లెక్కింపు పూర్తి..
మేడారం (Medaram) సమ్మక్క-సారక్క మహా జాతర హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 540 హుండీలను లెక్కించగా.. రూ. 13.25 కోట్ల ఆదాయం సమకూరింది. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండిని అమ్మవార్లకు భక్తులు కానుకలుగా సమర్పించుకున్నారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఫిబ్రవరి 29 నుంచి హుండీలను లెక్కించారు. మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలు సమ్మక్క-సారక్కలను దర్శించుకున్న విషయం తెలిసిందే. కాగా, 2022 మేడారం జాతర కంటే ఈ…

