చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్..! ఖరారు చేసిన కేసీఆర్..
భారత రాష్ట్ర సమితి(BRS) వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. బీఆర్ఎస్ తరపున చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gyaneshwar) పేరు ఖరారైనట్లు సమాచారం. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) నందినగర్లోని తన నివాసంలో సమావేశమయ్యారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీలు, నేతలు సమావేశంలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వంపై సమావేశంలో చర్చ…

