TELANGANA

TELANGANA

బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలకు నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, బీఆర్ఎస్ పార్టీ మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు.   మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌, హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం…

TELANGANA

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ – అమలు ముహూర్తం ఖరారు..!!

రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 21 శాతం ఫిట్ మెంట్ తో ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 53071 మంది ఉద్యోగులకు మేలు జరగనుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం పైన ఏటా రూ 418.11 కోట్ల మేర భారం పడనుంది. ఈ నిర్ణయం జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నిర్ణయం పైన…

TELANGANA

ఎన్నికల షెడ్యూల్ విడుదల- రేవంత్ రెడ్డి వరాలు..

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.   తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం…

TELANGANA

శివోహం.. కమనీయం వేములవాడ రాజన్న మహా శివరాత్రి ఉత్సవం..!

నేడు మహాశివరాత్రి పర్వదినం.. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగి పోతున్నాయి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు.. అలాంటి పరమశివునికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. పరమశివుడు విశ్వవ్యాప్తమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. అటువంటి మహాశివరాత్రి పర్వదినం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత ఘనంగా జరుగుతుంది.   వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తజన సందోహంతో, శివనామస్మరణతో మారుమోగిపోతుంది. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో…

TELANGANA

పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన.. ఎంఐఎంతో కలిసి అభివృద్ధి అంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు ..

పాతబస్తీ మెట్రో లైన్‌కు శుక్రవారం ఫరూక్‌నగర్ డిపో దగ్గర శంకుస్థాపన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మొత్తం 5.5 కిలోమీటర్ల పొడవునా 4 మెట్రో స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. రూ. 2 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.   ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని.. మిగితా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తామన్నారు సీఎం…

TELANGANA

తెలంగాణాను ఎడారి చేసే ప్లాన్; రేవంత్ రెడ్డి రేసుగుర్రం కాదు..కీలుగుర్రం..ఎమ్మెల్సీ కవిత..!

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కరువుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీ ఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేశారు. తెలంగాణలో నీళ్లు ఉన్న ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సాగునీటికి తాగునీటికి కటకట వస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ వదలడం లేదని ఆమె మండిపడ్డారు.   రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిలా…

TELANGANA

ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్ భూమి పూజ ..

కేంద్రంలో ఎవరున్నా తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని అడుగుతూనే ఉంటామని, సహకరించకపోతే ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధిని కుంటుపరుస్తుందన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రాజీవ్‌ రహదారి ఎలివేటెడ్‌ కారిడార్‌కు ముఖ్యమంత్రి గురువారం భూమి పూజ చేశారు.   ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా..…

TELANGANA

‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ద్వారా ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.   రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. రైతులు సాంకేతికత అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. రైతులకు మేలు చేసేలా తమ ప్రభుత్వం…

TELANGANA

మేడారం జాతర హుండీ లెక్కింపు పూర్తి..

మేడారం (Medaram) సమ్మక్క-సారక్క మహా జాతర హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 540 హుండీలను లెక్కించగా.. రూ. 13.25 కోట్ల ఆదాయం సమకూరింది. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండిని అమ్మవార్లకు భక్తులు కానుకలుగా సమర్పించుకున్నారు.   హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఫిబ్రవరి 29 నుంచి హుండీలను లెక్కించారు. మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలు సమ్మక్క-సారక్కలను దర్శించుకున్న విషయం తెలిసిందే. కాగా, 2022 మేడారం జాతర కంటే ఈ…

TELANGANA

కేసీఆర్ తో ఆర్ఎస్పీ భేటీ.. పొత్తు కోసమేనా..!..

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బంజారహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆర్ఎస్పీ కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరి సమావేశం చాలా సేపు జరిగినట్లు తెలుస్తోంది. భేటీలో మాజీ మంత్రి హరీశ్ రావు, వేముల ప్రశాంత్, బాల్క సుమన్ తో పాటు బీఎస్పీ నేతలతో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.   ఆర్ఎస్పీ,…