TELANGANA

TELANGANA

నేడు కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్ఎస్‌ కీలక నేతలు..?

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలనుంది. ఆ పార్టీ ముఖ్య నేతల కుటుంబాలు బీఆర్ఎస్‌ను వీడనున్నాయి. వారిలో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితా రెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. నేడు గాంధీ భవన్‌లో వీరికి దీపా దాస్ మున్షి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

TELANGANA

కొమురవెల్లిలో రైల్వే స్టేషన్.. నెరవేరుతున్న ఛిరకాల వాంఛ..

ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న భక్తులకు ఛిరకాల వాంఛ తీరబోతోంది. కొత్తపల్లి-మనోహరాబాద్ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌తో కలిసి భూమి పూజ చేశారు. అంతకుముందు వీరు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి ఉన్నారు.  …

TELANGANA

హరీశ్ రావు సీఎం కావాలంటే ఏం చేయాలో చెప్పిన రేవంత్ రెడ్డి..

గత ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడంపైనే దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ అందించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.   కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని సీఎం రేవంత్ తెలిపారు. గత రభుత్వ పదేళ్ల అన్యాయాలను గుర్తించిన ప్రజలు.. వారిని గద్దె దింపారని సీఎం స్పష్టం చేశారు.…

TELANGANA

తెలంగాణలో మరో 26 మంది డీఎస్పీల బదిలీ..

తెలంగాణ రాష్ట్రంలో డీఎస్పీల బదిలీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న 95 మంది డీఎస్పీలను బుధవారం బదిలీ చేయగా.. తాజాగా గురువారం మరో 26 మంది డీఎస్పీలను బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.   బుధవారం హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేశారు. రానున్న…

TELANGANA

తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే సంపుతరా..? నన్ను సంపి మీరుంటరా..?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కయ్యానికి కాలు దువ్వాయి. ఢీ అంటే ఢీ అంటోన్నాయి. నదీ జలాల అంశాలపై పరస్పరం సమరానికి సంసిద్ధం అయ్యాయి.   ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి.. గేరు మార్చింది. అధికార కాంగ్రెస్ పార్టీపై యుద్ధానికి దిగింది. కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న విధానాలకు నిరసనగా నల్గొండ గడ్డ మీద…

TELANGANA

అసెంబ్లీలో ప్రాజెక్టులపై సమరం..

తెలంగాణ అసెంబ్లీ వేదికగా డైలాగ్ వార్ కొనసాగింది. కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్‌ఎంబీకి అప్పగించే ప్రసక్తేలేదంటూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. దీని పైన చర్చ సమయంలో సీఎం రేవంత్, మంత్రులు వర్సస్ హరీష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీ సీఎం జగన్ ప్రస్తావన వచ్చింది. ఏపీకి ప్రయోజనం చేసేలా కేసీఆర్ వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం, మంత్రుల వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ కౌంటర్ చేసారు.   అసెంబ్లీలో డైలాగ్…

TELANGANA

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ బదిలీలు..

లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించింది. ఇంకో నెల రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.   తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.…

TELANGANA

17 నియోజకవర్గాల్లో బీజేపీ బస్సు యాత్రలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో తెలంగాణ బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అంతేగాక, విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1025 కిలోమీటర్ల మేర ఐదు బస్సు యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదివారం యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..…

TELANGANA

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సరికొత్త ఆలోచన..

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సరికొత్త ఆలోచన అమల్లోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఒకే ఒక్కడు సినిమా తరహాలో నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేయించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామాన్ వద్ద ఫిర్యాదు బాక్స్‌ను వెంకట రమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు.   కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఈ బాక్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కేవీఆర్ తెలిపారు. ఫిర్యాదులను గ్రామానికి వచ్చి నేరుగా తానే పరిష్కరిస్తానని తెలిపారు.…

TELANGANA

తెలంగాణా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకే పెద్దపీట..

రాష్ట్రంలో గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ ను ఓట్ ఆన్ ఎకౌంటు బడ్జెట్ గా ప్రవేశ పెట్టనుంది. మూడు నెలల కాలానికి ఈ బడ్జెట్ ఉన్నప్పటికీ, ఏడాది మొత్తానికి ఈ బడ్జెట్లో అంచనాలను ప్రకటిస్తారు.   2023 ఫిబ్రవరి నెలలో 2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా, నిర్దేశిత లక్ష్యాల మేరకు ఆదాయం రాకపోవడంతో…