TELANGANA

TELANGANA

రైతు రుణమాఫీ, గ్యారంటీల అమలు పై బడ్జెట్ లో భట్టి కీలక ప్రకటన..!

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు ప్ర‌తిపాదించిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల రుణ‌మాఫీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర కూడా అందిస్తామ‌ని భట్టి తన ప్రసంగంలో స్పష్టం చేసారు.   బడ్జెట్ ప్రతిపాదనలు : తెలంగాణ ప్రభుత్వం…

TELANGANA

కేసీఆర్ సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్..!

తెలంగాణా రాష్ట్రంలో గతంలో రెండు పర్యాయాలు పాలన సాగించిన బీఆర్ఎస్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి దూకుడుగా పాలన సాగిస్తున్నారు. ఇక ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.   ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా, తాజాగా మాజీ సీఎం…

TELANGANA

ఓటుకు నోటు కేసులో సుప్రీంలో కీలక పరిణామం..!!

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.   ఓటుకు నోటు కేసు హైదరాబాద్ నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను…

TELANGANA

మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ కమిటీ నివేదికలో సంచలన విషయాలు..

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్రప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో 16 నుంచి 21వ పియర్స్‌ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. అంతేగాక, 6,7,8 బ్లాకులను ఎల్ అండ్ టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని, మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని నివేదికలో వెల్లడించింది.   కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి ఐదు సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం…

TELANGANA

కేసీఆర్‌పై రేవంత్ వ్యంగ్యాస్త్రాలు..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు సీఎం రేవంత్.   కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందన్న రేవంత్ రెడ్డి..…

NationalTELANGANA

రైల్వే టికెట్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు..

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్‌, జోన్‌ పరిధిలోని ప్రధాన రైల్వేస్టేషన్‌లలోని టిక్కెట్‌ కౌంటర్లలో డిజిటల్‌ చెల్లింపులు అందుబాటులో తీసుకొచ్చారు. POS, UPI (ఫోన్ పే, Google Pay మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ నగదు రహిత విధానం వల్ల ప్రయాణికుల సమయం ఆదా కావడమే కాకుండా చిల్లర సమస్యలు ఉండవని అధికారుల తెలియజేశారు. త్వరలోనే అన్ని చోట్ల ఈ సౌకర్యాలను తీసుకొస్తామని రైల్వే శాఖ తెలిపింది.

TELANGANA

నీటి పారుదల శాఖలో భారీప్రక్షాళన..

నీటి పారుదల శాఖలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజినీర్లపై చర్యలు చేపట్టింది. రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లును తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈఎన్‌సీ జనరల్ మురళీధర్ రావును రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మరికొందరు ఇంజినీర్లపైనా వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.   తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం…

TELANGANA

రేవంత్ Vs కేసీఆర్, సభా సమరం..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించనున్నారు. కాగా.. 10వ తేదీన ప్రభుత్వం శాసనసభలో ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. సమావేశాలు 17వ తేదీ వరకూ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై ప్రభుత్వం..బీఆర్ఎస్ పైన చర్చ జరుగుతోంది.   నేటి నుంచి అసెంబ్లీ: తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయాల వేళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం…

TELANGANA

బాల్క సుమన్‌పై క్రిమినల్ కేసులు నమోదు..

భారత్ రాష్ట్ర సమితి అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు ఆయనపై మండిపడుతున్నారు. నిప్పులు చెరుగుతున్నారు. మాటలదాడికి దిగారు.   తాజాగా- బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, చెన్నూర్ మాజీ శాసన సభ్యుడు బాల్క సుమన్.. రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారు. ఘాటు విమర్శలు చేశారు. అనేక ఆరోపణలను సంధించారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద పాలేరుగా అభివర్ణించారు. మంచిర్యాల…

TELANGANA

సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సుమారు గంటపాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.   సోనియాతో భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియా గాంధీతో సమావేశమైనట్లు తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి…