TELANGANA

TELANGANA

బీఆర్ఎస్ ఓటమి కూడా మంచికే – కేటీఆర్..!!

తెలంగాణ అధికార కాంగ్రెస్..బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ రెండు పార్టీలు తమ పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి బీఆర్ఎస్ కు అవకాశం లేకుండా చేయాలనేది కాంగ్రెస్ లక్ష్యం. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవటం ద్వారా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలనేది కేసీఆర్ వ్యూహం. ఈ క్రమంలోనే ఎన్నికలకు సిద్దం అవుతూనే ఒక పార్టీని మరో పార్టీ ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.   కాంగ్రెస్ ప్రభుత్వం…

TELANGANA

రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్ స్కీంలకు ఆమోదం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయింది. ఈ మేరకు వివరాలను సమావేశం అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాకు వెల్లడించారు.   తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌కు టీజీగా…

TELANGANA

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సీనియర్ నేత..?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ ను కలవటం పైన కొత్త ప్రచారం మొదలైంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ ముఖ్య నేత పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు.   బీఆర్ఎస్ నేత, స్టేషన్…

TELANGANA

2.82 లక్షల ప్రజాపాలన దరఖాస్తుల తిరస్కరణ..!

అభయహస్తం పథకాలు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తు స్వీకరించారు. జనవరి 17 నాటికి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయింది. వచ్చిన 1,09,01,255 దరఖాస్తులలో 2.82 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. వాటిని నకిలీవిగా గుర్తించి తిరస్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు.   దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డ్ నంబర్‌, రేషన్ కార్డ్ నంబర్ ను నమోదు చేయలేదని వివరించారు. అసంపూర్తిగా ఉన్న…

TELANGANA

4న తెలంగాణ కేబినెట్ భేటీ..

తెలంగాణలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. ప్రధానంగా బడ్జెట్, గవర్నర్ ప్రసంగంపై చర్చించేందుకు ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఫిబ్రవరి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.   ఫిబ్రవరి 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.…

TELANGANA

త్వరలో రేవంత్ మార్క్ బడ్జెట్.. అన్ని నియోజకవర్గాలకు గుడ్ న్యూస్..!!

ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుండి తెలంగాణా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం. అయితే ఈసారి తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న బడ్జెట్ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.   ఈ క్రమంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో…

TELANGANA

తెలుగు రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టులు, కేటాయింపులు..!

కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో ప్రస్తావించిన అంశాలు, కేటాయింపుల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల సమయం లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలోనే రైల్వే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు చేసిన కేటాయింపుల పైన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. గతం కంటే అంచనాలు పెరిగినట్లు వెల్లడించారు.   ఎన్నికల ఏడాది కావటంతో నిర్మలా…

TELANGANA

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి.. తొలిసారి ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్!!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీలో గజ్వేల్ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల తుంటి శస్త్ర చికిత్స జరిగిన ఆయన చేతి కర్ర సహాయంతో తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ అసెంబ్లీ వద్ద కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఆపై కెసిఆర్ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కెసిఆర్ తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత…

TELANGANA

అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక, ఎందుకంటే..?

ప్రజలను ఇబ్బంది పెట్టి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.   గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా ఈ అంశం చర్చకు…

APTELANGANA

ఇస్తున్నవి ఇచ్చేవి–పేదరికంని పాల దోలవు. .

ఇస్తున్నవి ఇచ్చేవి–పేదరికంని పాల దోలవు. ఫోటో రైటప్స్: 1. జనం వినతుల వెల్లువ. 2 ఆవాసం నివాసం కోసం ఎగబడిన జనం. 3 మా కోసం మా ఊరు వచ్చావయ్యా. 4 పేదల కోసం యాత్ర. 5 నా దారి పేదల రహదారి అంటూ జాతీయ రహదారిప అన్నవరం: పేదలు నిరంతరం సమస్యలు ఎదుర్కొంటూ వాటితో పోరాడుతూనే ఉన్నారని ప్రస్తుతం వారి కోసం అంటూ ఇస్తున్నవి ఇచ్చేవి పేదరికం పారదోలడానికి ఏమాత్రం ఉపయోగపడని దళాధిపతి విజయ్ పేర్కొన్నారు.…