TELANGANA

TELANGANA

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరింది. ఈ అంశం పైన తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. దీని పైన విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దీని పైన రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు ప్రారంభించారు.   హైకోర్టులో విచారణ : ఆర్టీసీ…

TELANGANA

2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తాం: గత సర్కారులా కాదంటూ రేవంత్ రెడ్డి

ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7094 మంది స్టాఫ్ నర్సులకు నియామకపత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం తెలిపారు.   త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు కూడా భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్…

TELANGANA

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అసలు విషయం చెప్పిన కేటీఆర్..

పదేళ్లపాటు కమిట్మెంట్‌తో పనిచేశామని.. అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడిపించామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్ఎస్‌ను ఆదేశించారని కేటీఆర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.   మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఆరున్నర లక్షల…

TELANGANA

అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు..ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.   ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని…

TELANGANA

రేవంత్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు – బెర్తులు దక్కేదెవరికి..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ, పాలనా పరంగా వేగంగా తన ఆలోచనలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన రేవంత్..ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ గురించి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని అంచనా. ఈ లోగానే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు.   మంత్రివర్గ విస్తరణ : ముఖ్యమంత్రి రేవంత్ తన మంత్రివర్గ విస్తరణకు నిర్ణయించారు. మొత్తం…

TELANGANA

నెలన్నర రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో 12 కోట్ల మంది మహిళల ప్రయాణం..

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి రోజు లక్షలాది మంది మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.   45 రోజుల్లో 12 కోట్లకుపైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని సజ్జనార్ తెలిపారు. సగటున ప్రతి రోజు 27 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్నారని వెల్లడించారు. నాంపల్లిలోని…

TELANGANA

కేసీఆర్ ఈజ్ బ్యాక్…

అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని ఎదుర్కొన్న భారత్ రాష్ట్ర సమితి.. లోక్‌సభ బరిపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాలను ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకుంటోంది. అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది. రెండు- మూడు తప్ప అన్ని లోక్‌సభ నియోజకవర్గాలపైనా సమీక్షలు పూర్తి చేసింది.   అటు అధికార కాంగ్రెస్ పార్టీపై దాడికి సమాయాత్తమౌతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటి కోసం పోరుబాట పట్టబోతోంది. ఇప్పటికే రేవంత్ సర్కార్‌కు అల్టిమేటాన్ని…

TELANGANA

రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..

తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ నెలాఖరు నాటికి ఈ-కేవైసీ గడువు ముగియబోతోన్న నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గడువును మరో నెల రోజుల పాటు పొడిగించింది.   ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఉన్న పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ.. రాష్ట్రవ్యాప్తంగా బోగస్‌ కార్డుల ఏరివేత చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం లబ్దిదారులు తమ రేషన్‌ కార్డులను అప్‌డేట్ చేసుకోవడానికి ఈ-కేవైసీ విధానాన్ని…

TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు..

బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన సతీమణి నీలిమపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తప్పుడు పత్రాలతో భూ ఆక్రమణలకు యత్నించారని పీర్జాదిగూడకు చెందిన రాధిక.. పల్లా దంపతులపై ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్లా దంపతులపై కేసు నమోదు చేరశారు.   జోడిమెట్ల సమీపంలోని చౌదరిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఫ్లాట్ల విషయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్లాట్లు 1984లో…

TELANGANA

రాజ్‌భవన్‌లో ఎట్ హోం: సీఎం రేవంత్ సహా ప్రముఖుల హాజరు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు దూరం..

గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా రాజ్‌భవన్‌లో శుక్రవారం రాత్రి ఎట్‌ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అహ్వానం మేరకు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సహా మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు గవర్నర్ ఆతిథ్యం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది.   కాగా, రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎట్హోం కార్యక్రమం జరగడం…