TELANGANA

TELANGANA

రైతు భరోసా అమలు ముహూర్తం ప్రకటించిన రేవంత్..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణలో రైతు భరోసా పైన చర్చ జరుగుతున్న వేళ ఈ పథకం ఎప్పుడు అమలు చేసేదీ క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన గ్యారంటీల అమలు పైన క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ పైన రేవంత్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ నేతలు తన పైన చేస్తున్న విమర్శలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.   బీఆర్ఎస్…

TELANGANA

ఆ విషయంలో బట్టలిప్పి నిలబెడతాం: రేవంత్ రెడ్డిపై ఘాటుగా కేటీఆర్!!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అధికారంలోకి వచ్చిన 45 రోజులైనా రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుంచి సాగుతుందన్నారు.   రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించినట్టు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని కేటీఆర్ ఆరోపించారు. ఇలా అబద్ధాలు చెప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.…

TELANGANA

తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న నావికాదళం… వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్.

భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్‌ను ఉపయోగిస్తుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్ట మొదటిది. 1990 నుంచి…

TELANGANA

రైతు రుణ మాఫీపై సర్కార్ కసరత్తు..

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రజలకు భారీ హామీలు ఇచ్చింది. ముఖ్యంగా రైతులకు చాలా హామీలు ప్రకటించింది. అందులో రైతు రుణ మాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు డబ్బులు ప్రముఖంగా ఉన్నాయి. ఈసారి పాత పద్ధతిలోనే రైతు బంధు జమ చేస్తున్నారు. వానకాలం నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎకరానికి రూ.10 ఇస్తుండగా.. రైతు భరోసాలో భాగంగా ఎకరానికి రూ. 15 వేలు ఇవ్వనున్నారు.   గత బడ్జెట్‌‌లో రైతుబంధుకు రూ.15070కోట్లు…

TELANGANA

ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ అమలు..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరో హామీని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. తాజాగా, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉచిత్ విద్యుత్ పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది.   కోమటిరెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ…

TELANGANA

పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ..

శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. అందుకే ఆయన బీఆర్ఎస్ నల్గొండ లోక్ సభ సన్నాహాక సమావేశానికి హాజరు కాలేదని చెబుతున్నారు. అయితే పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్లైతే తన కొడుకు అమిత్ రెడ్డికి టికెట్ ఎందుకు అడుగుతాను అని గుత్తా ప్రశ్నించారు. కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.   అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్…

TELANGANA

తెలంగాణలో పెన్షన్ రూ 4 వేలకు పెంపు హామీ – ప్రభుత్వం తాజా నిర్ణయం..!

తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ రూ 4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో కొత్త పింఛన్‌ డబ్బులు ఇస్తారని లబ్ది దారులు ఆశించారు. కానీ, ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈ నెల కూడా పాత ఫించన్లే అందనున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం పింఛన్లు పెంచుతామని చెప్పినా ఇందుకు సంబంధించి సర్కార్‌ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో అధికారులు ఈ నెల కూడా పాత పద్ధతిలోనే పింఛన్లు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు.  …

TELANGANA

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు..

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కొత్తగా రూట్ మ్యాప్ తాజాగా ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశాల మేరకు ఫేజ్ 2 రూట్ మ్యాప్ను సిద్దం చేసిన మెట్రో అధికారులు, 70 కిలో మీటర్లు కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.   హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా, సిటీలోని నలుమూలాలకు…

TELANGANA

కేటీఆర్‍ మతిస్థిమితం కోల్పోయారు.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు…

మాజీ మంత్రి కేటీఆర్ పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిరంకుశ విధానాలు ఇంకా ఉన్నాయన్నారు. విద్యుత్ బిల్లులు కట్టొద్దని కేటీఆర్ అనడం ప్రజాస్వామ్యమా అని నిలదీశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారని చెప్పారు.   గ్యారంటీలు వందరోజుల్లో అమలు చేయడం అంటే చట్టబద్దత రావడమేనని పేర్కొన్నారు. కొంచెం ఆలస్యం అయినా కాంగ్రెస్ గ్యారెంటీలు…

TELANGANA

మూసీ నదిపై ఆర్కిటెక్ట్‌లతో సీఎం రేవంత్ సమావేశం…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో వివరణాత్మక చర్చలు జరిపారు. మూసీ నదిపై మాట్లాడారు. మారథాన్ బ్యాక్-టు-బ్యాక్ మీటింగ్ సెషన్‌లు ప్రధానంగా 56-కిలోమీటర్ల పొడవున్న మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి చేయడం, వాణిజ్య అనుసంధానాలు, పెట్టుబడి నమూనాలను అన్వేషించడంపై చర్చలు జరిపారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి తెలిపారు. తదుపరి సంప్రదింపుల కోసం…