TELANGANA

TELANGANA

తెలంగాణ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సోమవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.   కాగా, తాజా నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయస్సును 44 నుంచి 46కు పెంచుతూ…

TELANGANA

తెలంగాణలో డ్వాక్రా మహిళలకు శుభవార్త ..

తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.   భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు.…

TELANGANA

మేడారం జాతరకు 6 వేల బస్సులు సిద్ధం..

తెలంగాణ కుంభమేళ మేడారం జాతర కోసం టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇప్పటికే వేలాది మంది జాతరకు వెళ్లి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మలను (Sammakka Saralamma Jatara 2024) దర్శించుకుని బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ వేలాది ప్రత్యేక బస్సులను నడుపుతోంది.   ఈ బస్సులను ఆదివారం నుంచి ఫిబ్రవరి 25 వరకు నడిపించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి, ఉమ్మడి వరంగల్జిల్లాలో 18 ప్రాంగణాల నుంచి ప్రత్యేకంగా 6000 బస్సులను…

TELANGANA

కాంగ్రెస్ నేతలతో ఈటల రాజేందర్ ఫొటో..పార్టీ మార్పుపై క్లారిటీ..?

కాంగ్రెస్ పార్టీ నేతలతో బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ఫొటోలు వైరల్ కావడం చర్చనీయాశంగా మారింది. ఈ క్రమంలో ఆయన స్పందించారు. తాను కాంగ్రెస్పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని బీజేపీ సీనియర్నేత ఈటల రాజేందర్స్పష్టత ఇచ్చారు. బీజేపీ కార్పొరేటర్కొప్పుల నరసింహా రెడ్డి గృహ ప్రవేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశానని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు తప్పుడు వార్తలను సృష్టించారని మండిపడ్డారు.   తాను కాంగ్రెస్‌లో చేరనున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్అవుతున్న…

TELANGANA

గత పదేళ్ళలో ఇరిగేషన్ అవినీతి: ప్రాజెక్టులపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల..!

తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో శ్వేతపత్రం విడుదల చేసింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో నీటిపారుదల రంగంపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.   అనంతరం మాట్లాడుతూ…ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులలో అవినీతికి చోటులేకుండా, సమర్థ వినియోగంతో, అత్యధిక ఆయకట్టుకు నీరు అందించేందుకు అవసరం అయిన నిధులను సమకూర్చుకునే…

TELANGANA

ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చేరికలకు గేట్లెత్తేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితిని ఖాళీ చేసే పనిలో పడ్డారు. బీఆర్ఎస్‌లో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకులను మళ్లీ సొంత గూటికి రప్పించుకుంటోన్నారు.   ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జిల్లా పరిషత్…

TELANGANA

కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..

కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు.   అన్ని పార్టీల నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటామని మంత్రి పొన్నం తెలిపారు. అయితే, నాటి సమగ్ర సర్వే వివరాలు ఎందుకు…

TELANGANA

పవన్ పోటీ నియోజకవర్గాలపై చంద్రబాబు కీలక సూచన..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. వైసీపీ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ తుది దశక చేరింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పైన ఒక అంచనాకు వచ్చారు. బీజేపీతో పొత్తు అంశం తెర మీదకు రావటంతో సీట్ల ప్రకటన వాయిదా పడింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల పైన ఆసక్తి కొనసాగుతోంది. తాజాగా చంద్రబాబుతో చర్చల్లో పవన్ పోటీ చేసే నియోజకవర్గాల పైన క్లారిటీ వచ్చినట్లు సమాచారం.   కొత్త…

TELANGANA

నేడు కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్ఎస్‌ కీలక నేతలు..?

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలనుంది. ఆ పార్టీ ముఖ్య నేతల కుటుంబాలు బీఆర్ఎస్‌ను వీడనున్నాయి. వారిలో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితా రెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. నేడు గాంధీ భవన్‌లో వీరికి దీపా దాస్ మున్షి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

TELANGANA

కొమురవెల్లిలో రైల్వే స్టేషన్.. నెరవేరుతున్న ఛిరకాల వాంఛ..

ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న భక్తులకు ఛిరకాల వాంఛ తీరబోతోంది. కొత్తపల్లి-మనోహరాబాద్ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌తో కలిసి భూమి పూజ చేశారు. అంతకుముందు వీరు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి ఉన్నారు.  …