TELANGANA

TELANGANA

తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే సంపుతరా..? నన్ను సంపి మీరుంటరా..?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కయ్యానికి కాలు దువ్వాయి. ఢీ అంటే ఢీ అంటోన్నాయి. నదీ జలాల అంశాలపై పరస్పరం సమరానికి సంసిద్ధం అయ్యాయి.   ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి.. గేరు మార్చింది. అధికార కాంగ్రెస్ పార్టీపై యుద్ధానికి దిగింది. కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న విధానాలకు నిరసనగా నల్గొండ గడ్డ మీద…

TELANGANA

అసెంబ్లీలో ప్రాజెక్టులపై సమరం..

తెలంగాణ అసెంబ్లీ వేదికగా డైలాగ్ వార్ కొనసాగింది. కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్‌ఎంబీకి అప్పగించే ప్రసక్తేలేదంటూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. దీని పైన చర్చ సమయంలో సీఎం రేవంత్, మంత్రులు వర్సస్ హరీష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీ సీఎం జగన్ ప్రస్తావన వచ్చింది. ఏపీకి ప్రయోజనం చేసేలా కేసీఆర్ వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం, మంత్రుల వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ కౌంటర్ చేసారు.   అసెంబ్లీలో డైలాగ్…

TELANGANA

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ బదిలీలు..

లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించింది. ఇంకో నెల రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.   తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.…

TELANGANA

17 నియోజకవర్గాల్లో బీజేపీ బస్సు యాత్రలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో తెలంగాణ బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అంతేగాక, విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1025 కిలోమీటర్ల మేర ఐదు బస్సు యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదివారం యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..…

TELANGANA

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సరికొత్త ఆలోచన..

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సరికొత్త ఆలోచన అమల్లోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఒకే ఒక్కడు సినిమా తరహాలో నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేయించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామాన్ వద్ద ఫిర్యాదు బాక్స్‌ను వెంకట రమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు.   కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఈ బాక్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కేవీఆర్ తెలిపారు. ఫిర్యాదులను గ్రామానికి వచ్చి నేరుగా తానే పరిష్కరిస్తానని తెలిపారు.…

TELANGANA

తెలంగాణా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకే పెద్దపీట..

రాష్ట్రంలో గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ ను ఓట్ ఆన్ ఎకౌంటు బడ్జెట్ గా ప్రవేశ పెట్టనుంది. మూడు నెలల కాలానికి ఈ బడ్జెట్ ఉన్నప్పటికీ, ఏడాది మొత్తానికి ఈ బడ్జెట్లో అంచనాలను ప్రకటిస్తారు.   2023 ఫిబ్రవరి నెలలో 2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా, నిర్దేశిత లక్ష్యాల మేరకు ఆదాయం రాకపోవడంతో…

TELANGANA

రైతు రుణమాఫీ, గ్యారంటీల అమలు పై బడ్జెట్ లో భట్టి కీలక ప్రకటన..!

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు ప్ర‌తిపాదించిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల రుణ‌మాఫీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర కూడా అందిస్తామ‌ని భట్టి తన ప్రసంగంలో స్పష్టం చేసారు.   బడ్జెట్ ప్రతిపాదనలు : తెలంగాణ ప్రభుత్వం…

TELANGANA

కేసీఆర్ సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్..!

తెలంగాణా రాష్ట్రంలో గతంలో రెండు పర్యాయాలు పాలన సాగించిన బీఆర్ఎస్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి దూకుడుగా పాలన సాగిస్తున్నారు. ఇక ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.   ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా, తాజాగా మాజీ సీఎం…

TELANGANA

ఓటుకు నోటు కేసులో సుప్రీంలో కీలక పరిణామం..!!

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.   ఓటుకు నోటు కేసు హైదరాబాద్ నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను…

TELANGANA

మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ కమిటీ నివేదికలో సంచలన విషయాలు..

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్రప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో 16 నుంచి 21వ పియర్స్‌ వరకు పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. అంతేగాక, 6,7,8 బ్లాకులను ఎల్ అండ్ టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని, మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని నివేదికలో వెల్లడించింది.   కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి ఐదు సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం…