TELANGANA

TELANGANA

అష్టదిగ్బంధనం – బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గులాబీ అధినేత రాజకీయంగా వరుస ఎదురు దెబ్బలు తింటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ వెంట నడిచిన సీనియర్లు కాంగ్రెస్ బాట పట్టారు. దీంతో, గులాబీ పార్టీ కుదేలవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.   వరుస షాక్ లతో బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు.…

TELANGANA

జైల్లో చిప్పకూడే.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం గాంధీభవన్‌లో వాల్మీకి, బోయలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ ముగియగానే వాల్మీకి, బోయల డిమాండ్లు నెరవేరుస్తామన్నారు. గద్వాల్, ఆలంపూర్ ప్రాంతంలోని బోయల గురించి తనకు తెలుసన్నారు. ఇప్పుడు అందరూ ఒకవైపు రండి.. మన ప్రభుత్వం ఉందన్నారు.   ఢిల్లీలో కూడా మన పరిపాలనను అభినందిస్తున్నారని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఎవరు ఏ…

TELANGANA

రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్‌పై కేసు నమోదు ..

చెంగిచెర్లలో ఇటీవల జరిగిన ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా, గురువారం గోషామహల్బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ను పోలీసులు హౌస్అరెస్టు చేశారు. అయితే, పోలీసుల తీరుపై రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంగిచెర్లకు బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే.. తనను అడ్డుకుని హౌస్అరెస్టు చేశారని రాజాసింగ్మండిపడ్డారు.   పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజా సింగ్ ధ్వజమెత్తారు. హోలీ పండుగ రోజు చెంగిచెర్లలో హిందువులపై దాడి జరిగిందని, చాలా మంది మహిళలు, యువత గాయపడ్డారని రాజాసింగ్…

TELANGANA

కేసీఆర్‌కు మరో షాక్.. బీఆర్ఎస్‌కు కడియం శ్రీహరి, కావ్య గుడ్‌బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో..

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. తాజాగా, మరో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు.   తాను వరంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కావ్య లేఖ రాశారు. బీఆర్ఎస్ నుంచి పోటీకి…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న పోన్ ట్యాపింగ్ కేసుపై కేటీఆర్ తొలిసారిగా స్పందించారు. కాంగ్రెస్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపిస్తుందని.. ఒక వేళ చేస్తే ఒక్కరో ఇద్దరివో ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండవచ్చని కేటీఆర్ అన్నారు. దాని గురించి తనకేం తెలుసని ప్రశ్నించారు. దొంగల ఫోన్లు ట్యాప్ చేయండం పోలీసుల పని అని పేర్కొన్నారు. కేటీఆర్ మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్నారు. హస్తం పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాలం గడువుతుందని కేటీఆర్ విమర్శించారు.…

TELANGANA

తెలంగాణ కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన..

తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రాజేంద్రనగర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కింది కోర్టుల్లోనే కాదు.. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందన్నారు. కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సీజేను అభినందించారు.   నూతన భవనంలో స్త్రీలు, దివ్యాంగుల వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలుండాలని అన్నారు. న్యాయ వ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లకు కిషన్ రెడ్డి సవాల్ ..

ఫోన్ ట్యాపింగ్ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసులపై స్పందిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మంగళవారం హైదరాబాద్నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్హయాంలో అన్ని రకాల దోపిడీలు జరిగాయని ఆరోపించారు. అబద్ధాలతోనే కేసీఆర్రాజకీయాలు నడిపించారని, ప్రజలను మభ్యపెట్టి పదేళ్లు పాలన సాగించారని విమర్శించారు.   ఈ క్రమంలోనే రాష్ట్రంలో గతంలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్చేశారని, ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్…

TELANGANA

కవిత కేసులో కీలక మలుపు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత విచారణను ఎదుర్కొంటోన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. మరిన్ని రోజుల పాటు ఆమె కస్టడీలోనే ఉండనున్నారు.   నిజానికి- కవిత కస్టడీ నేటితో ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమెను అధికారులు ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని, మరింత…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు….

తెలంగాణ రాష్ట్ర సమితి.. ఉద్యమ సమయంలో ప్రతి తెలంగాణ పౌరుడికి సుపరిచితమైన పేరు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే టీఆర్ఎస్ గా ఉండే. అందుకే 2014లో తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ కు పట్టం కట్టారు. 2018లో మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం ఇచ్చారు. అయితే ఆ పార్టీ అధినేత పార్టీ పేరును మార్చాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చారు. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగు…

TELANGANA

పాఠశాలల అభివృద్ధికి రేవంత్ సర్కారు కీలక నిర్ణయం..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి విషయంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు చిన్నపాటి రిపేర్లను వేసవి సెలవుల లోపు పూర్తి చేసేందుకు ఎమర్జెన్సీ అండ్ మెయింటనెన్స్ ఫండ్ విడుదల చేయనుంది.   ప్రభుత్వం కొత్తగా ఇచ్చే ఈ నిధులతో పాఠశాలలకు అవసరమైన ట్యూబ్ లైట్లు, బల్బులు, ఫ్యాన్లు, స్విచ్చులు, నీటి సరఫరా ఏర్పాట్లు చేసుకోవచ్చు. వీటన్నింటినీ ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేయనున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు చేపట్టనున్నాయి.…