TELANGANA

TELANGANA

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌-తమిళి సై రాజీనామా ఆమోదం..!

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రాజీనామా నేపథ్యంలో కేంద్రం కొత్త గవర్నర్ నియామకాన్ని ప్రకటించింది. జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ను కొత్త గవర్నర్ గా అదనపు బాథ్యతలు కట్టబెట్టింది. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా మరో అదనపు బాధ్యత ఇచ్చింది. అలాగే తమిళి సై సౌందర రాజన్ చేసిన రాజీనామాను కూడా ఆమోదిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.   ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన…

TELANGANA

సుప్రీంకోర్టులో కవిత మరో రిట్ పిటిషన్..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో మంగళవారం మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో కవిత తరఫున ఆమె న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో న్యాయవాది కోరారు.   తన అరెస్ట్ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించారని, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్ట్ చేశారని కవిత అందులో పేర్కొన్నారు. తన అరెస్ట్…

TELANGANA

సరికొత్త ప్రచారాస్త్రాన్ని చేపట్టిన తెలంగాణ బీజేపీ..

సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సరికొత్త ప్రచారాస్త్రాన్ని సిద్దం చేసింది. బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌తో కలిసి నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో వెబ్‌సైట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇచ్చిన గ్యారంటీల అమలు జరిగే వరకు కాంగ్రెస్‌ను వెంటాడుతామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.   కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు అమలు చేసే పత్తా లేకుండా పోయిందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.…

TELANGANA

కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్సీని కలిసిన కేటీఆర్, హరీశ్ రావు..

దేశ రాజధాని ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను ఆమె భర్త అనిల్ తోపాటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఆదివారం కలిశారు. కవిత అరెస్టును సవాల్ చేస్తూ అనిల్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. కాగా, ఢిల్లీ మద్యం కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.   కవిత తొలిరోజు విచారణ పూర్తి  …

TELANGANA

ఎమ్మెల్సీ కవితే ప్రధాన కుట్రదారు..–:ఈడీ..

లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రధాన కుట్రదారుగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. కవిత ఆప్ ముఖ్య నేతలతో కలిసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రా సౌత్ గ్రూపును నడిపించారని ఈడీ వివరించింది. మద్యం పాలసీ ద్వారా డబ్బులు రాబట్టడానికి రూ.100 కోట్లు ముడుపులు చెల్లించినట్లు గుర్తించామని తెలిపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో కవిత ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలినట్లు పేర్కొంది.   కవిత సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి పలువురు…

TELANGANA

తెలంగాణలో 17 స్థానాల పోలింగ్, కౌంటింగ్ ముహూర్తం ఖరారు..!!

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరనుంది. ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అందులో భాగంగా నాలుగో విడతలో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ ముహూర్తం ఖరారైంది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే తెలంగాణలో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది. దీంతో, వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది.   తెలంగాణలోకి 17 ఎంపీ…

TELANGANA

తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నోటిఫికేషన్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. కాగా, టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్ది సేపటికే టెట్ నోటిఫికేషన్ రావడం గమనార్హం.   అంతకుముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.…

TELANGANA

మల్కాజిగిరి, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి(BRS) మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్‌గిరి నుంచి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేర్లను బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ఖరారు చేశారు. రాష్ట్రంలోని 17 స్థానాలకు ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ 11 మంది అభ్యర్థులను ప్రకటించింది.   సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని, పార్టీ ముఖ్యనేతలు, క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించి, అందరి ఏకాభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించారు. కాగా,…

NationalTELANGANA

బీజేపీ రెండో జాబితా విడుదల, తెలంగాణ నుంచి డీకే అరుణ సహా పోటీలో వీరే..!

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారం విడుదల చేసింది. ఈ 72 మందిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఇప్పటి వరకు మొత్తం 15 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక, ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.   తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో…

TELANGANA

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇలా చేయండి..!

ఈనెల 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి అర్హులను ఎలా ఎంపిక చేస్తారు? ఏం చేయాలి అనే గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతోపాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. పథకాలన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం శరవేగంగా అమలు చేసుకుంటూ వెళుతోంది.   అభయహస్తం పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వాటిద్వారా…