ఆటో డ్రైవర్లకు రూ. 15 వేల భృతి ఇవ్వాలంటూ హరీశ్ రావు డిమాండ్..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను రోడ్డన పడేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినా.. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడం అంతే ముఖ్యమని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణాలతో ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. అంతేగాక, ఆటో డ్రైవర్లకు ప్రతి నెల రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా డిగ్రీ…

