TELANGANA

TELANGANA

బీజేపీకి 10 సీట్లు, తెలంగాణలో భారీ స్క్రీన్లలో రామ మందిర ప్రారంభోత్సవం: కిషన్ రెడ్డి..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) ధీమా వ్యక్తం చేషశారు. 10 ఎంపీ సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్న బీజేపీ.. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇంఛార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ హాజరయ్యారు.…

TELANGANA

లోక్‌సభ బరిలో ఈటల.. రేవంత్ రెడ్డి స్థానంపై కన్ను

లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించింది. ఇంకో రెండు నెలల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.   తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని…

TELANGANA

తెలంగాణలో సమన్వయకర్తలను నియమించిన కాంగ్రెస్..

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు ముమ్మరం చేసింది. 28 రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలను పలువురు మంత్రులు, ముఖ్య నేతలకు అప్పగించింది.   మహబూబ్‌నగర్, చేవెళ్ల స్థానాల బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమన్వయం చేయనున్నారు. మల్కాజిగిరికి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం, మహబూబాబాద్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్‌కు కొండా సురేఖ, ఆదిలాబాద్…

TELANGANA

ప్రజాపాలనకు ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించినున్న సీఎం రేవంత్..

డిసెంబర్ 28 తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సోమవారం నాడు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.   ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు,…

TELANGANA

రైతు రుణమాఫీ పై రేవంత్ గుడ్ న్యూస్ ..

ముఖ్యమంత్రి రేవంత్ రైతు రుణ మాఫీ అమలుపై కీలక ప్రకటన చేసారు. రైతు రుణమాఫీ దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. త్వరలోనే రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలుకు కార్యాచరణ ఖరారు చేసారు. అదే సమయంలో రైతుబంధు అమల్లోనూ సీలింగ్ పైన కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా చర్చించిన తరువాత నిర్ణయం ప్రకటించనున్నారు. రైతు రుణమాఫీ కోసం కార్పోరేషన్ ఏర్పాటు తో పాటుగా నిధుల సమీకరణ పైన నిర్ణయం తీసుకున్నారు.   రుణమాఫీ కసరత్తు: కాంగ్రెస్…

TELANGANA

తెలంగాణలో దరఖాస్తుల ఉప్పెన…

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆరు ఉచిత గ్యారంటీల అమలు.. వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంపై దృష్టి సారించారు.   ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో పరి పాలనను వారి వద్దకే తీసుకెళ్తోన్నారు. ఈ క్రమంలో ప్రజా పాలన కార్యక్రమానికి తెర తీశారు. కిందటి నెల 28వ…

TELANGANA

జగన్ బాటలో రేవంత్, వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం..

ఏపీలో సక్సెస్ అయిన వాలంటీర్ల వ్యవస్థ తెలంగాణలో ఏర్పాటు కానుంది. సంక్షేమ పథకాలు ఏపీలో ప్రజల ఇంటి ముందుకు తీసుకెళ్తున్న వాలంటీర్ల వ్యవస్థ పైన ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విధానం అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో భాగంగా వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. దాదాపు 80 వేల వాలంటీర్ల ఉద్యోగాల నియామకాలు చేపట్టనున్నట్లు సమాచారం.   వాలంటీర్ వ్యవస్థ : తెలంగాణ ప్రభుత్వం ఏపీ అమలు చేస్తున్న…

TELANGANA

ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు నేడే చివరిరోజు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంపు చేసింది.   కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగు హామీలను అమలు చేయాల్సి ఉండగా దీనికోసం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా…

TELANGANA

బీఆర్ఎస్ భవన్‍కు రెవెన్యూ శాఖ నోటీసులు….

బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా హైదరాబాద్ బంజరాహిల్స్ లోని బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ అధికారులు నోటీసీలు జారీ చేశారు. పార్టీ ఆఫీస్ లో నిబంధనలకు విరుద్దంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని నోటీసులో పేర్కొంది. పార్టీ కార్యాలయంలో కొనసాగుతోన్న టీవీ ఛానెల్ ను మరో చోటికి మార్చుకోవాలని స్పష్టం చేసింది. న్యూస్ ఛానెల్ ఎప్పటిలోగా ఖాలీ చెస్తారో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.   ఈ మేరకు తెలంగాణ భవన్…

TELANGANA

అమిత్ షాతోపాటు కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో వరుస భేటీలతో బిజి బిజీగా గడుపుతున్నారు. గురువారం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సందర్భంగా రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.   ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్త‌గా వ‌చ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణ‌కు అధికారుల‌ను అద‌నంగా…