World

World

అమెరికన్ కంపెనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

భారతదేశంలో ఒకప్పుడు అత్యధిక ప్రజాదరణ పొందిన అమెరికన్ బ్రాండ్ ‘ఫోర్డ్’ (Ford) ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసింది. అయితే తన కస్టమర్లకు సర్వీస్ వంటివి అందిస్తోంది. కాగా ఇటీవల ఈ సంస్థకు సుప్రీంకోర్టు ఏకంగా రూ. 42 లక్షల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఒక కస్టమర్ డీలర్‌షిప్ నుంచి ‘ఫోర్డ్ ఎండీవర్’ 3.2 లీటర్ వెర్షన్‌ను కొనుగోలు చేసారు.…

World

అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానం

అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్‌బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్‌పై అభిశంసనానికి రెడీ అయ్యారు. సెనేటర్ చక్ గ్రాస్లీ ఎఫ్‌డీ-1023 ఫారమ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానిలో బైడెన్‌, అతని కుమారుడు హంటర్ తాము చేసిన సహాయానికి బదులుగా కైవ్‌కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ సీఈఓను మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపించారు. వైట్ హౌస్‌లో అత్యంత అవినీతి…

World

పాకిస్తాన్‌లో అంజు ప్రేమికుల పుకారు

పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ నేపథ్యం, భారతదేశంలోకి ఆమె అక్రమ ప్రవేశంపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక భారతీయ మహిళ ఇప్పుడు తన ప్రేమికుడిని కలవడానికి సరిహద్దు దాటి వెళ్లింది. రాజస్థాన్‌లోని భివాడి జిల్లాకు చెందిన ఒక వివాహిత భారతీయ మహిళ, తాను ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి, ప్రేమలో పడిన వ్యక్తిని కలవడానికి పాకిస్తాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌కు వెళ్లింది. అంజు అనే 35…

World

ఐరాసలో అనూహ్య పరిణామం-భారత్ మద్దతుతో పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్.. !

చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాకిస్తాన్ లు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది ? దీనికి సమాధానం ఐక్యరాజ్యసమితిలో దొరికింది. ఐరాసలో గతంలో ఎన్నో అంశాల్లో విభేదిస్తూ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకునే ఇరుదేశాలు ఈసారి మద్దతిచ్చుకున్నాయి. దీని ఫలితంగా భారత్ పై నిత్యం విషం కక్కే పాకిస్తాన్ ఐరాసలో తన పంతం నెగ్గించుకుంది. భారత్ తో పాటు చైనా కూడా ఈ విషయంలో పాకిస్తాన్ కు అండగా నిలిచాయి. యూరప్ లోని స్వీడన్ లో ఖురాన్ దహనం…

World

ఎలాన్ మస్క్ మరో సంచలనం

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఉన్నన్ని రోజులూ రోజుకో సంచలనం రేపుతూ నిత్యం వార్తల్లో నిలిచిన ఈ అపర కుబేరుడు.. తాజాగా ఓ కొత్త స్టార్టప్‌ను స్టార్ట్ చేశారు. కార్పొరేట్ సెగ్మెంట్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్‌లో మనుషుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయొచ్చనే అంచనాలు ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలో పూర్తిస్థాయిలో అడుగుపెట్టారు…

World

రష్యా సైన్యంలో అసమ్మతి గళం.. జనరల్ ఇవాన్ పోపోవ్ సస్పెండ్..

ఆక్రమిత దక్షిణ ఉక్రెయిన్‌లో బలగాల కమాండ్‌లో ఉన్న ఒక సీనియర్ రష్యన్ జనరల్ ఇవాన్ పోపోవ్ ను రష్యా తొలగించింది. మాస్కో రక్షణ మంత్రిత్వ శాఖ నాయకత్వం తగినంత మద్దతు ఇవ్వకుండా తన దళాలకు ద్రోహం చేసిందని జనరల్ ఆరోపించడంతో ఈ చర్య తీసుకుంది. జనరల్ ఇవాన్ పోపోవ్ 58వ కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి కమాండర్‌గా ఉన్నారు. వీరు జపోరిజ్జియా ప్రాంతంలో భారీ యుద్ధం చేస్తున్నారు. ఇవాన్ పోపోవ్ అత్యంత సీనియర్ అధికారులలో ఒకడు. అప్పట్లో ఇవాన్…

World

మోడీకి ఫ్రాన్స్ టూర్ లో షాక్ ? మణిపూర్ హింసను ఖండిస్తూ యూరప్ పార్లమెంట్ తీర్మానం

ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ లోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో రెండు నెలలుగా సాగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐరోపా దేశాలతో కూడిన యూరోపియన్ పార్లమెంట్ ఓ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించింది. దీనిపై భారత్ స్పందించింది. అది తమ అంతర్గత విషయమని ఐరోపా దేశాలకు స్పష్టం చేసింది. అయినా భారత ప్రధాని తమ దేశాల్లో పర్యటిస్తున్న వేళ యూరోపియన్ పార్లమెంట్ వేసిన అడుగు కలకలం రేపింది. ప్రధానమంత్రి నరేంద్ర…

World

మోదీ పర్యటన వేళ- భారతీయులకు శుభవార్త వినిపించిన ఫ్రాన్స్

పారిస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ పర్యటన ఆరంభమైంది. ఈ మధ్యాహ్నం ఆయన పారిస్‌లో ల్యాండ్ అయ్యారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్నె స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి మోదీకి స్వాగతం పలికారు. అక్కడే సైనిక వందనాన్ని స్వీకరించారు మోదీ. ప్రవాస భారతీయులు ఆయనను కలుసుకున్నారు. అనంతరం ఫ్రాన్స్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఇండియన్ డయాస్పొరాను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రయాన్ 3 ప్రయోగం సహా అనేక అంశాలను ప్రస్తావించారు.…

World

ప్రధాని మోడీకి యూఏఈ అధ్యక్షుడు ప్రత్యేక విందు: భారత్-యూఏఈల మధ్య కీలక ఒప్పందాలు

దుబాయ్: ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈకి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ శనివారం అబుదాబికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, వారి చెల్లింపు, సందేశ వ్యవస్థలను ఇంటర్‌లింక్ చేయడానికి భారతదేశం, యూఏఈ సెంట్రల్ బ్యాంక్‌లు రెండు అవగాహన…

World

అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి.. పరారీలో నిందితుడు

అమెరికాలో కాల్పుల ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికాలోని జార్జియాలో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. కాల్పులకు పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నట్లు స్థానిక అధికారి ఒకరు వార్తా సంస్థకు తెలిపారు. అట్లాంటాకు దక్షిణంగా ఉన్న ఒక చిన్న కమ్యూనిటీలో జరిగిన కాల్పుల్లో కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని జార్జియాలోని కౌంటీ ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. అట్లాంటాకు దక్షిణంగా ఉన్న హాంప్టన్ సబ్ డివిజన్‌లో శనివారం ఉదయం జరిగిన సామూహిక కాల్పులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు…