CINEMA

పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో లక్షలు పెట్టి ఆ వజ్రాన్ని తేబోతున్న ప్రొడ్యూసర్..కారణం..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు.ఈయన ఇప్పటికే ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూ మరోవైపు జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా (Harihara Veeramallu) షూటింగ్ శరవేగంగా జరుపుతోంది. ఇక ఈ సినిమా పిరియాడికల్ మూవీ అని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలియజేసింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియోస్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక షాకింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమాకి సంబంధించి డిసెంబర్ 31న టీజర్ ని రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావించినప్పటికీ సినిమాకి సంబంధించి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంకా పెండింగ్ లోనే ఉండడం వల్ల టీజర్ లాంచింగ్ ని వాయిదా వేశారు మూవీ యూనిట్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించడం వల్ల ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు మూవీ యూనిట్. ఇక తాజాగా ఈ సినిమా నిర్మాత ఎ.ఎం రత్నం ( A.M.Rathnam) ఏకంగా 30 లక్షలు పెట్టి చాలా విలువైన ఒక కోహినూర్ వజ్రం లాంటి డైమండ్ ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా పిరియాడికల్ ఫిక్షన్ మూవీ.అలాగే ఈ సినిమా ఔరంగజేబు కు సంబంధించి హిస్టారికల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.అందుకే ఇందులో ప్రతి ఒక్క సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు తెరకెక్కించాలి అనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఈ సినిమాపై భారీ పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కథ మొత్తం కోహినూర్ వజ్రం చుట్టే తిరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.