CINEMA

దర్శకధీరుడు ss రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో

దర్శకధీరుడు ss రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాకి ప్రముఖ రచయిత.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి వర్క్ షాప్ కూడా మొదలైందట. త్వరలోనే మహేష్ కూడా ఈ వర్క్ షాప్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ మూవీ గురించి ఒక క్రేజి న్యూస్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అదేంటంటే. ఈ మూవీ మూడు భాగాలుగా రానుందట. ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ కు తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఈ క్రమంలోనే ఈ సినిమాను ఏకంగా మూడు భాగాలుగా తీసుకురావాలని ఆలోచనతో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటులు కూడా నటించనున్నారని టాక్. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో రెండు భాగాలుగా సినిమాలు వచ్చాయి. మూడు భాగాలు అంటే అది ఇప్పుడు రాజమౌళి – మహేష్ మూవీ తోనే మొదలు కాబోతోంది. ఈ అప్డేట్ తో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఒక సినిమా అంటేనే సంవత్సరాల టైం తీసుకునే రాజమౌళి.. మూడు భాగాలంటే ఎంత గ్యాప్ తో రిలీజ్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజ హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల మందికి రానుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.