National

భారత నేవీలోకి 200 బ్రహ్మోస్..

భారత నేవీలో యుద్ధ నౌకల కోసం 200 బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మార్చి మొదటి వారంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్, రక్షణశాఖ దీనిపై అధికారికంగా ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. రూ.19 వేల కోట్లు విలువైన ఈ మెగా డీలు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదించింది. మరోవైపు బ్రహ్మోస్ మిసైళ్ల ఎగుమతి కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.