National

‘ఢిల్లీ ఛలో’లో ఉద్రిక్తత.. వారి ఆస్తులు సీజ్..

‘ఢిల్లీ ఛలో’లో భాగంగా పంజాబ్-హరియాణా సరిహద్దులో ఇటీవల జరిగిన ఉద్రిక్త ఘటనలపై హరియాణా పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద చర్యలకు సిద్ధమయ్యారు. ముందుస్తుగా హెచ్చరించిన విధంగా పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసానికి పాల్పడినందుకుగాను.. పరిహారం కింద బాధ్యుల బ్యాంకు అకౌంట్లు, ఆస్తులు సీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులు చనిపోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డినట్లు తెలిపారు.