AP

ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం జగన్…

ఏప్రిల్ మూడో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించి తలపెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమావేశం ఆసక్తిక రేకిస్తొంది. ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఈ సమావేశం ఉంటుందంటూ నాయకులకు సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడం చూస్తుంటే ఈ సమావేశానికి చాలా ప్రాధాన్య ఉన్నట్టు అర్థమవుతుంది. సీఎం ఎందుకు అత్యవసరంగా ఈ సమావేశం పెట్టారు? సీఎం ఎందుకు అందర్నీ పిలుస్తున్నారు? అనే డౌట్స్ నేతలలో మొదలయ్యాయి. త్రుల పని తీరు ఆధారంగా ఒకరిద్దరి ను కేబినెట్ నుంచి తప్పిస్తానని జగన్ మోహన్ రెడ్డి ఆ విషయం చెప్పడానికి ఈ సమావేశం పెట్టారా ? అనే డౌట్ తో కొంత మంది ఉన్నారు. మొదటి కేబినెట్ కూర్పు ఎలా ఉంటుంది అనేది శాసనసభ పక్ష సమావేశం లోనే చెప్పారు జగన్. ఇప్పుడు కేబినెట్ పునర్ అంకితం గురించి కూడా ఈ సమావేశంలో చెప్తారా? లేదా చూడాలి. శాసన మండలి నుంచి ఇద్దర్నీ కేబినెట్ లోకి తీసుకునే లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అదే విషయాన్ని ఈనెల 14వ తేదీన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మంత్రులందరికి చెప్పేశారు జగన్ ఏప్రిల్ 3 జరిగే ఈ సమావేశంలో అదే విషయాన్ని జగన్ చెప్తారో లేదో చూడాలి.