National

ధర్మవరం టీడీపీ అభ్యర్ధి ఖరారు – హోరా హోరీ..!!

రానున్న ఎన్నికలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నవ్ ఆర్ నెవర్ గా ప్రకటించారు. ప్రతీ సీటు కీలకంగా మారుతోంది. ఇప్పటికే కొన్ని సీట్లకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ..మరి కొన్ని నియోజకవర్గాల్లో ఆచి తూచి వ్యవహరిస్తోంది.

జనసేనతో పొత్తు వేళ సీట్ల కేటాయింపు పైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అనంతపురం జిల్లా నుంచి ఈ సారి పరిటాల కుటుంబం రెండు సీట్లపైన ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలో ధర్మవరం సీటు పైన నిర్ణయం జరిగింది. టీడీపీ అభ్యర్ధి ఖరారయ్యారు.

ధర్మవరం నుంచి శ్రీరామ్: ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీకి పట్టుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరుపున గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి ధర్మవరం నుంచి గెలిచారు. అయితే 2019లో ఓటమి పాలయిన తర్వాత తనకున్న సమస్యల దృష్ట్యా ఆయన బీజేపీలో చేరారు. దీంతో ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను పరిటాల శ్రీరామ్ కు చంద్రబాబు అప్పగించారు.