AP

ప్రోటోకాల్ విషయంపై ఎంక్వయిరీ చేసిన,జిల్లా పంచాయతీ అధికారి (DPO) కొండలరావు.

 

ప్రోటోకాల్ విషయంపై ఎంక్వయిరీ చేసిన,జిల్లా పంచాయతీ అధికారి (DPO) కొండలరావు.

ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,ఇందుకూరు పేటలో ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) కొండలరావు సమక్షంలో గత 2022 సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదో తేదీన దేవీపట్నం మండలం లోని శరభవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన సచివాలయం ప్రారంభోత్సవానికి దేవారం గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రం రమాదేవి కి ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర కి ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంపై పేర్లు నమోదు చేయకపోవడం మరియు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించలేదని గత సంవత్సరం ఫిబ్రవరి నెల లో ఇచ్చిన ఫిర్యాదు పై ఎంక్వయిరీ నిమిత్తం స్థానిక దేవి పట్నం మండలం ఎంపీడీవో డి.ఎన్.రత్నకుమారి ని, గతంలో పనిచేసిన శరభవరం సచివాలయ పంచాయతీ సెక్రెటరీ పి.మోహన్ ని, ప్రస్తుత శరభవరం సచివాలయం పంచాయతి సెక్రటరీ లోవ బాబు లతోపాటు దేవారం గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రం రమాదేవి మరియు శరభవరం, దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర లను ఎంక్వయిరీ చేసి ఐదుగురు నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నరని దేవీపట్నం మండలం వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్ మరియు శరభవరం,దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర ఓ ప్రకటనలో తెలిపారు.