AP

ఈనెల 15, 16,17 తేదీల్లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన

కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈనెల 15, 16,17 తేదీల్లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకి సంబంధించి నేడు చంద్రబాబు స్టేట్ టూర్ కోఆర్డినేటర్స్ రవి యాదవ్, గంటా గౌతమ్, పరుచూరి కృష్ణ, టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూతో కలిసి చంద్రబాబు పర్యటించే రూట్ ని పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఫిబ్రవరి 15, 16 ,17 తేదీల్లో చంద్రబాబు పర్యటన ఖరారు అయిన నేపథ్యంలో రూట్ పరిశీలిస్తున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, టిడిపి జిల్లా మీడియా కోఆర్డినేటర్ ఉండవల్లి వీర్రాజు, క్లస్టర్ ఇన్చార్జి పైడిపాల సూరిబాబు, రేఖా బుల్లి రాజు, సర్వసిద్ధి లక్ష్మణరావు, ఉప్పలపాటి బుల్లెబ్బు, కందుల సత్యనారాయణ, కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర తదితరులు పాల్గొన్నారు.