AP

క్రియాశీల సభ్యత్వల నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని కిర్లంపూడి మండల కమిటీ అధ్యక్షుకు ఉలిసి అయిరాజ్

క్రియాశీల సభ్యత్వల నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని కిర్లంపూడి మండల కమిటీ అధ్యక్షుకు ఉలిసి అయిరాజ్ పిలుపునిచ్చారు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గత రెండు సంవత్సరాలుగా క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది ఆంధ్ర రాష్ట్రమంతా జరుగుతోంది రాష్రంలో ప్రమాదవశాస్తూ మరణించిన 96 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకి రు॥4.80 కోట్లు, ప్రమాధబారినపడిన 165 మందికి మెడికల్ బిల్లుల నిమిత్తం సుమారు 2 కోట్ల రూపాయలు అందించి పార్టీ వారి కుటుంబాలకి అండగా నిలిచింది. వారికి దురదృష్టంలో కూడా కొంచెం మేలు జరిగిందన్నారు. ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి అందజేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం నిర్ణయం ఎంతో ఉత్తమమైందని జనసేన పార్టీలో పనిచేసే ప్రతి జనసేన సైనికుడు జనసేన నాయకులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమంలో పాల్గొని ఈనెల 10 వ తేదీ నుంచి 28వ తారీకు వరకు భారీసంఖ్యలో సభ్యత్వ నమోదులు జరిగే విధంగా మనందరం కృషిచేసి ఈకార్యక్రమం విజయవంతం చేయాలని అలాగే జనసేన కుటుంబాలకి మేలు కరిగే విధంగా ఉంది కనుక మన నియోజకవర్గంలో ప్రతీ గ్రామంనుండి ఎక్కువ మొత్తంలో సభ్యత్వాలు నమోదయ్యే విధంగా కృషి చేయాలని మన పార్టీ విధి విధానాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ప్రజల్లోకి తీసుకు వెళుతూ మన అండ పార్టీకి తెలియ చేస్తూ మన నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయానికి తోడ్పడాలని ఎక్కువ శాతం సభ్యత్వ నమోదు చేయిందామని మన జనసైనికులను, వీరమహిళలను, నాయకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ మరియు నియోజకవర్గనాయకులు పాలిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు.