AP

సర్వజనులకు భగవంతుడు ఒక్కడే

పార్వతీపురం పట్టణంలోని ఓంశాంతి కేంద్రంలో 87వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ సీఐ కృష్ణారావు విచ్చేశారు. ఈ వేడుకల్లో ముందుగా ప్రధాన రహదారి గుండా విశ్వశాంతి పాదయాత్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బ్రహ్మకుమారి జ్ఞాన రత్నం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సర్వజనులకు భగవంతుడు ఒక్కడే అని తెలిపారు. అలాగే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు, ప్రాముఖ్యత గురించి తెలిపారు. నేటి దైనందిక జీవితంలో మానవుడు మానసిక ప్రశాంతతను పొందే మార్గం, శాంతి స్థాపన, ఆరోగ్య జీవన శైలి వంటి విషయాలను వివరించారు. ఓం శాంతి కేంద్రాల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానమార్గం లభిస్తుందని, ఆందోళనలు దూరమై జీవితానికి ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు.

ఈ వేడుకల్లో దైవ ప్రచారకులు శివ ప్రసాద్, కార్యనిర్వాహకులు, సేవకులు,, ప్రజలు పాల్గొన్నారు.