AP

బిఎస్ఎన్ఎల్ టవర్స్ శంకుస్థాపనకు భూమి పూజ చేసిన ప్రజాప్రతినిధులు సర్పంచ్ తుర్రం రమాదేవి, ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.

అల్లూరి జిల్లా…
దేవీపట్నం మండలం…

బిఎస్ఎన్ఎల్ టవర్స్ శంకుస్థాపనకు భూమి పూజ చేసిన ప్రజాప్రతినిధులు సర్పంచ్ తుర్రం రమాదేవి, ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.

చిన్నారి గండి మరియు ముసిని గుంట గ్రామాలలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ శంకుస్థాపనకు భూమి పూజ చేశామని సర్పంచ్ తుర్రం రమాదేవి,ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,దేవారం గ్రామ పంచాయతీలోని చిన్నారి గండి మరియు ముసినిగుంట గ్రామాలలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ శంకుస్థాపనకు భూమి పూజ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా దేవీపట్నం మండలం వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్ మరియు శరభవరం,దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి తేవాలని ఉద్దేశంతో మారుమూల గ్రామాలు కు సైతం సెల్ టవర్లు ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు మెంబర్లు తుర్రం రామన్న దొర మరియు గ్రామస్తులు కలుం రామకృష్ణ దొర,తుర్రం రామకృష్ణ దొర,జీ.అర్జున్ రావు,కొమరం వీరమణి,తుర్రం రంగన్న దొర,సోదే ఉదయ్ కిరణ్, కారం శ్రీనివాస్ దొర,కె.జగదీష్ దొర,కె.రాంపండు, మడి శ్రీను వాసు దొర,కొమరం చిన్నబ్బాయి దొర,కుంజం సూర్యనారాయణ దొర,సిహెచ్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు