AP

జగన్ తో ఉద్యోగ నేతల భేటీ- వారిని నమ్మొద్దు -సీఎం కీలక వ్యాఖ్యలు…!

ఏపీలో పలు ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఎంతో పలు విషయాలపై చర్చించారు.

అలాగా తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారితో మాట్లాడిన సీఎం జగన్.. ఉద్యోగుల విషయంలో తాము పడుతున్న తపనను వారికి వివరించారు.

ఇవాళ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్‌ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ముఖ్యంగా జీపీఎస్‌ అమలు నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని వారికి తెలిపారు.