AP

జనసేన-టీడీపీ సమన్వయ సమావేశాలు.. కో-ఆర్డినేటర్లను నియమించిన జనసేన

వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ-జనసేన కలిసి ముందుకు నడవాలని నిర్ణయించిన విషయం విదితమే.. ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు..

ఈ నెల 29, 30, 31వ తేదీల్లో జిల్లాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 29వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు.. ఈ నెల 30వ తేదీన కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉమ్మడి మీటింగులు ఉండనున్నారు.. ఇక, ఈ నెల 31వ తేదీన విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశం కానున్నారు టీడీపీ – జనసేన పార్టీల నేతలు. జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరుకానున్నారు..